సిద్దిపేట, ఫిబ్రవరి 19 : సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలో నిత్యం ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్న తడి, పొడి చెత్తతో తయారైన సేంద్రి య ఎరువును సిద్దిపేట బ్రాండ్ కార్బన్ టైట్స్ పేరుతో మార్కెట్లోకి రానున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా రు. ఆదివారం సాయంత్రం నియోజకవర్గ ప్రతినిధులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఎరువులో సేం ద్రియ కర్బనం అధికంగా ఉండి మామిడి, ఆయిల్పామ్, వరి కూరగాయల వంటి పంటలకు వేస్తే అధిక దిగుబడి వస్తున్నదని, నాణ్యమైన ఉత్పత్తులు పొందే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట రైతులకు అందించాలనే ఆలోచనతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
ఛత్రపతి శివాజీ సేవలు గొప్పవి
సిద్దిపేట, ఫిబ్రవరి 19 : దేశానికి ఛత్రపతి శివాజీ చేసిన సేవలు ఎంతో గొప్పవని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా పట్టణం నాగదేవత ఆలయం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహానికి మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డితో కలిసి పూలమాల వేశారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.