పజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు రాజర్షి షా, శరత్కుమార్ అన్నారు. కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి వారు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని, తిరస్కరించిన అర్జీలకు సరైన వివరణ ఇవ్వాలని సూచించారు. మెదక్ జిల్లాలో 94, సంగారెడ్డి జిల్లాలో 48 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
మెదక్, మే 8 (నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందిస్తూ పరిషరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఆయన అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి 94 వినతులు స్వీకరించారు. ఇందులో ధరణికి సంబంధించి 50, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి 20, పింఛన్లకు సంబంధించి 5 ఫిర్యాదులు ఉండగా, ఇతర శాఖలకు సంబంధించి వచ్చిన 19 వినతులను ఉన్నాయి. ఆయా ఫిర్యాదులను కలెక్టర్ సంబంధిత శాఖాధికారులకు అందజేస్తూ ప్రాధాన్యతా క్రమం లో పరిషరించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలన్నారు. మంగళవారం నుంచి మండలాలలో నిర్వహించే సమావేశాల్లో గ్రామ పంచాయతీ పనులకు సంబంధించి డబ్బులు రెండు, మూడు వారా ల్లో వస్తాయని సర్పంచులకు భరోసా కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వెంటనే మొదలుపెట్టాలన్నారు. ఈజీఎస్ కింద శ్రామికులకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. పెండింగ్ ఉన్న 42 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. ఈ నెల 15 నుంచి 17 వరకు సీఎం కప్, కోకో, కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ అంశాల్లో అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నామని, అకడ విజేతలకు జిల్లాకేంద్రంలో 22 నుంచి 24 వరకు పోటీలు నిర్వహిస్తున్నామని, అందుకు మండల స్థాయి లో చకటి ఏర్పాట్లు చేయాలన్నారు. పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్ ప్రదానం చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు వెంకట శైలేశ్, శ్రీనివాస్, సాయిబాబా, రవిప్రసాద్, జయరాజ్, విజయశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, రజాక్, జెంలా నాయక్, ఆశాకుమారి, కరుణ, విజయలక్ష్మి, బ్రహ్మాజీ, రజిని, నాగరాజ్, జానకీరామ్సాగర్, డాక్టర్ నవీన్, సుధాకర్, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య ఉప కేంద్రాల పనులను వేగవంతం చేయాలి
ప్రగతిలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల పనులను వేగవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఇంజజినీరింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణ ప్రగతిపై వైద్యాధికారులు, ఇంజజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమై పురోగతిపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్ర వైద్య సేవ మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో 34, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 43 ఉప కేంద్రాల నిర్మాణం చేపట్టగా ఇంతవరకు 10 కేంద్రాలు మాత్రమే పూర్తయ్యాయన్నారు. చివరి దశలో ఉన్న నిర్మాణ పనులను ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని, వివిధ దశలలో ఉన్న నిర్మాణాలను జూన్ 15 లోగా పూర్తిచేసేలా కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలన్నారు. వెల్దుర్తి, రంగంపేట, అల్లాదుర్గ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాల మరమ్మతు లు, పునరుద్ధరణ పనులు వేగవంతం చేసి జూన్లో వాడుకలో వచ్చేలా చూడాలని అధికారులకు, కాం ట్రాక్టర్లకు సూచించారు. సమావేశంలో జి ల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందు నాయక్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఈఈ రవీందర్ రెడ్డి, పంచాయత్ రా జ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వోలు విజయనిర్మల, అనిల, సిబ్బంది పాల్గొన్నారు.
రేపటిలోగా విధుల్లో చేరాలి
సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మంగళవారం సాయంత్రం 5 గంటల లోగా విధుల్లో చేరవలసినదిగా మెదక్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధ్దీకరించవల్సినదిగా డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 28 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా స్పందిస్తూ సమ్మె విరమించి విధుల్లో చేరాలని స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేశారని సోమవారం కలెక్టర్ తెలిపారు. రెగ్యులర్ నియామకం కానందున క్రమబద్ధీకరణకు హకు లేదా దావా వేయడానికి అవకాశముందన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో మంగళవారం లోగా విధుల్లో చేరుటకు ఒక అవకాశం ఇచ్చిందని, చేరని వారిని ఉద్యోగంలోంచి తొలిగిస్తామని నోటీసులో పేరొందని, కాబట్టి సమ్మెలో ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరాలని కలెక్టర్ సూచించారు.