మెదక్ : ఉచిత విద్యుత్ వద్దన్న కాంగ్రెస్ నాయకులను ఊరి పొలిమేరల్లోకి రానియొద్దు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి తరికొట్టాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మాటలపై నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటల ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మతిలేనివన్నారు.
రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం, మిషన్ కాకతీయ ఇలా పలు రకాల రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ దేశానికి రోల్మాడల్గా నిలిచింది.అదుకే రైతాంగంపై కాంగ్రెస్ కక్ష కట్టింది. ఓవైపు బీజేపీ వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే మరోవైపు కాంగ్రెస్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దు అని రైతుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
70 ఏళ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసింది. కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఉండేది. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టే రైతుల గురించి ఆలోచించి అనేక పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులను నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. ఏ రాజకీయం లేకుండా రైతుకు న్యాయం జరగాలన్న తపనతో పథకాలు అమలు చేస్తూన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో నర్సాపూర్ శాసనసభ్యుడు మదన్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
MLA Padma devender reddy, Telangana, ,Free Current