సంగారెడ్డి జూన్ 1(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గురువారం కంటివెలుగు వైద్య శిబిరాల్లో 7918 మందికి కంటి పరీక్షలు చేశారు. 3876 పురుషులు, 4042 మంది మహిళలకు కంటి పరీక్షలు చేశారు. గ్రామాల్లోని 6274, పట్టణాల్లోని 1290, జీహెచ్ఎంసీలోని 354 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.
కంటి పరీక్షలు చేసిన వారిలో 256 మందికి కళ్ల అద్దాలు అందజేశారు. 261 మంది కోసం ప్రిస్కిప్షన్ అద్దాలను వైద్యులు ఆర్డర్ చేశారు. 281 మంది పురుషులు, 292 మంది మహిళలకు కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.