75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉమ్మడి మెదక్ జిల్లా ముస్తాబైంది. జిల్లా కేంద్రాల్లో రిపబ్లిక్ డే సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9 గంటలకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు జాతీయ జెండాను ఆవిషరించి, గౌరవ వందనం స్వీకరిస్తారు.
అనంతరం కలెక్టర్లు ప్రజలను ఉద్దేశించి, సందేశాన్ని అందించనున్నారు. ఉదయం 9 నుంచి 10గంటల వరకు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నారు. ఉత్తమ అధికారులకు అవార్డులు ఇవ్వనున్నారు. అనంతరం విద్యార్థులతో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.