మెదక్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినం. 1959న లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. అమరులైన సైనికులతోపాటు విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలను అక్టోబర్ 21న స్మరించుకుని, నివాళులర్పిస్తారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అనునిత్యం పోరాడుతున్నారు. ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటు న్నారంటే పోలీసులే కారణం. తీవ్రవాదం, అసాంఘిక శక్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు కొంత మంది పోలీసులు ప్రాణాలను త్యాగం చేశారు. అమరులను స్మరించుకునేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్డే) నిర్వహిస్తున్నారు.
1999 సెప్టెంబర్ 13న మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్స్టేషన్లో రాత్రివేళ విధులు నిర్వహిస్తున్న హెడ్కానిస్టేబుల్ రఘునందన్, కానిస్టేబుళ్లు ప్రసాద్, రాం చందర్, నర్సింహులు, అబేద్ హుస్సేన్పై పీపుల్స్వార్ నక్సలైట్లు కాల్పులు జరిపారు. పోలీస్స్టేషన్లో ఉన్న ఆయుధాల కోసం వచ్చిన నక్సలైట్లు విధులు నిర్వర్తిస్తున్న వీరిని చంపి, పోలీస్స్టేషన్ను పేల్చివేశారు. అనం తరం పోలీస్స్టేషన్లోని ఆయుధాలు ఎత్తుకెళ్లారు.
1991 ఏప్రిల్ 4న కౌడిపల్లి పోలీస్స్టేషన్ ఎస్సై దా మోదర్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ మల్లేశం నక్సలైట్లపై దాడి చేయడానికి కౌడిపల్లి మండలం ధర్మాసాగర్ గ్రామా నికి వెళ్లారు. అకడే కాపుకాసిన నక్సలైట్లు ఎస్సైతో పా టు హెడ్కానిస్టేబుల్ను కాల్చిచంపారు. 1997 నవంబర్ 11న శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో ఓ ఇంట్లో నక్సలైట్లు సమావేశం నిర్వహిస్తు న్నారనే సమాచారంతో తూప్రాన్ డీఎస్పీ బాలసుబ్రమణ్యం, సీఐ వెంకటస్వామి, హెడ్కానిస్టేబుల్ పెంట య్య, శివ్వంపేట పోలీస్స్టేషన్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్రావు, లక్ష్మణ్నాయక్, సుజాయత్అలీ ఘటనా స్థలా నికి వెళ్తుండగా పేలుడు పదార్థాలు పేలి అకడికకడే మృతి చెందారు. 1996 నవంబర్ 11న ఏఆర్ హెడ్కానిస్టేబుల్ రాములు ఒక కేసులో నక్సలైట్ను మెదక్ నుంచి నిజామాబాద్ కోర్టుకు బస్సులో తీసుకెళ్తున్నా డు. బాన్సువాడ ప్రాంతంలో ఆర్టీసీ బస్సును అడ్డగించిన నక్సలైట్లు రాములును కాల్చిచంపారు.
పోలీసు అమరవీరులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించారు. మెదక్ జిల్లాలో అమరులైన వారిలో డీఎస్పీ, సీఐ, ఎస్సైతోపాటు నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. అమ రులైన పోలీసు కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం కారుణ్య నియమకాల కింద ఉద్యోగాలను కల్పించింది.
పోలీస్ ఫ్లాగ్డే సందర్భంగా వ్యాసరచన పోటీలు, షార్ట్ ఫిలిమ్స్, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ రోహిణిప్రియదర్శిని తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఈ నెల 21 నుంచి సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి (జాతీయ ఐక్యత దినోత్సవం) 31వ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇం దులో భాగంగా ఓపెన్హౌస్ నిర్వహించి పోలీసు విధు లు, త్యాగాలు, సాంకేతిక వినియోగంపై అవగాహన క ల్పిస్తామని తెలిపారు. https://forms.gle/b7bej vzfo6j29Vuz6 వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తెలు గు, ఇంగ్లిష్, ఉర్దూ భాషలో వ్యాసరచన పోటీలు నిర్వ హిస్తామని ఎస్పీ రోహిణిప్రియదర్శిని వివరించారు.