తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నది. వ్యవసాయ మార్కెట్ల నిర్మాణం, గోదాములు, రైతు వేదికలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇలా అన్ని ఏర్పాటు చేస్తూ అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషి ఫలితంగా గజ్వేల్ పట్టణంలోని రింగ్రోడ్డు పక్కన రూ.2.47కోట్లతో 22 ఎకరాల విస్తీర్ణంలో కాటన్ మార్కెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తద్వారా సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాల రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. కాటన్ మార్కెట్లో అధికారుల కార్యాలయ భవనం, షెడ్డు, ప్లాట్ఫాం, సీసీ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో అన్ని పనులను పూర్తిచేసి రైతులకు కాటన్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పాలకవర్గం కృషిచేస్తున్నది.
గజ్వేల్ రూరల్, అక్టోబర్ 12: తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. రైతులను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ మార్కెట్ల నిర్మాణం, గోదాములు, రైతు వేదికలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతున్నది. గజ్వేల్లో కొత్తగా నిర్మాణం చేపడుతున్న కాటన్ మార్కెట్ పనులు వడివడిగా కొనసాగుతున్నాయి. సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాల రైతులను దృష్టిలో ఉంచుకొని గజ్వేల్ పట్టణంలోని రింగ్ రోడ్డు పక్కనే రూ.2.47కోట్లతో 22 ఎకరాల విస్తీర్ణంలో కాటన్ మార్కెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషి ఫలితంగా త్వరలోనే గజ్వేల్ కేంద్రంగా కాటన్ మార్కెట్ రైతులకు అందుబాటులోకి రానున్నది.
గజ్వేల్ నియోజకవర్గంలో రైతులు అధికంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలు సాగుచేస్తారు. రైతులు పండించిన పత్తిని సీసీఐ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తుంటారు. జిల్లాలోనే గజ్వేల్ ప్రాంతంలో పత్తి ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ గజ్వేల్ పట్టణం సమీపంలోని రింగ్రోడ్డు పక్కనే 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.47కోట్లతో కాటన్ మార్కెట్ నిర్మాణ పనులు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు కాటన్ మార్కెట్లో అధికారుల కార్యాలయ భవనం, షెడ్డు, ప్లాట్ ఫాం, సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిన్నింటిని త్వరగా పూర్తి చేసి చుట్టూ ప్రహరీ నిర్మించనున్నారు. త్వరలో అన్ని పనులను పూర్తి చేసి రైతులకు కాటన్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పాలకవర్గ సభ్యులు కృషి చేస్తున్నారు.
రైతులకు ప్రయోజనం
గజ్వేల్లో కాటన్ మార్కెట్ నిర్మాణం పూర్తయితే రైతులకు మరింత ప్రయోజనం చేకూరనున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు అమ్ముకునేందుకు వీలుగా కాటన్ మార్కెట్ నిర్మాణం చేస్తున్నారు. దీంతో సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాల రైతులకు మేలు జరుగనున్నది. ముఖ్యంగా గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల రైతులకు దగ్గరలో మార్కెట్ ఉంటుంది. అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ గజ్వేల్ కేంద్రంగా కాటన్ మార్కెట్ నిర్మాణం చేయిస్తున్నారు. దళారుల బెడద లేకుండా రైతులు పత్తిని అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త గజ్వేల్ ప్రాంతంలో విరివిగా గోదాంల నిర్మాణాలు చేపట్టారు. వ్యవసాయ మార్కెట్లో భారీ షెడ్లు నిర్మించారు.
మార్కెట్లో షెడ్డు
త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయిస్తాం
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంలో గజ్వేల్లో కాటన్ మార్కెట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఇప్పటికే నిర్మాణ పనులు కొన్ని పూర్తవగా మరిన్ని పనులు త్వరలోనే పూర్తయ్యే విధంగా వేగం పెంచాం. సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా గజ్వేల్లో కాటన్ మార్కెట్ను ప్రారంభించుకొని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి రైతుకు న్యాయం చేస్తున్నది.
– మాదాసు శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్, గజ్వేల్
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ నిరంతరం రైతుల సంక్షేమ కోసం కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు. గజ్వేల్లో కాటన్ మార్కెట్ అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో మేలు జరుగనున్నది. కోట్లాది రూపాయలతో చేపడుతున్న మార్కెట్లు, గోదాంల వల్ల రైతులకు న్యాయం జరుగుతది. గతంలో ఎన్నడూ లేని విధంగా పంట పెట్టుబడి సాయం, రైతు బీమా అందిస్తున్న సీఎం కేసీఆర్ రైతుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు.
– బాల్రాజు, రైతు, రిమ్మనగూడ