జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన
సంగారెడ్డి జిల్లాలో 9,531 కేసుల పరిష్కారం
రూ.36,540,288 నష్టపరిహారం అందజేత
సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్రెడ్డి
మెదక్ జిల్లాలో 13,829 కేసుల పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద
కక్షిదారులతో కిటకిటలాడిన రెండు జిల్లాల్లోని కోర్టు ప్రాంగణాలు
మెదక్ అర్బన్, జూన్ 26: రాజీమే రాజమార్గమని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నా రు. ఆదివారం జిల్లా న్యాయస్థానముల సముదాయం లో ఆమె అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. చిన్న చిన్న గొడవలతో జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ఇద్దరు వ్యక్తులు రాజీ చేసుకోవడంతో ఇరువురికి న్యాయం చేకూరుతుందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా మెదక్, నర్సాపూర్ కోర్టుల్లో కలిపి, 13,829 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కల్పన, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి అర్బన్, జూన్ 26: జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. ఆదివారం సంగారెడ్డి జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు. వివిధ కేసులకు సంబంధించి కక్షిదారులతో మాట్లాడి సత్వర పరిష్కారం చూపారు. జిల్లావ్యాప్తంగా 11 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి, 9,531 కేసులను పరిష్కరించారు. మోటార్ వాహన ప్రమాద నష్ట పరిహారం, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ, విద్యుత్ చౌర్యం, ఈపీ కేసుల్లో మొత్తం రూ.3,65,40,288 నష్ట పరిహారాన్ని బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి శశిధర్రెడ్డి మాట్లాడుతూ లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పని, అప్పీలు చేసుకునే అవకాశం ఉండదని తెలిపారు. సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ కోర్టుల్లో ప్రత్యేకంగా లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి సుదర్శన్, మూడో అదనపు జిల్లా జడ్జి పి.రాజు, సీనియర్ సివిల్ జడ్జి పుష్పలత, జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి ఆశాలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జలీల్, స్పెషల్ ఎక్సైజ్ కోర్టు జడ్జి హన్మంతరావు, ప్రథమ శ్రేణి అదనపు జడ్జి కుమారి తేజశ్రీ, స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి నిర్మల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.