నర్సాపూర్, డిసెంబర్ 1: ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పరామర్శించి, దవాఖానకు తరలించి ఉదారతను చాటుకున్న ఘటన మండలంలోని ఆవంచ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. హత్నూరా మండలం మధిర గ్రామం లో జరిగిన ఒక కార్యక్రమంలో నర్సాపూర్ ఎ మ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం తిరుగు ప్రయాణంలో నర్సాపూర్ వ స్తున్న క్రమంలో ఆవంచ గ్రామ సమీపంలో హత్నూరా మండలం మంగాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డా డు. ఇది గమనించిన ఎమ్మెల్యే తక్షణమే తాను ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపివేశారు. బాధితుడి వద్దకు వెళ్లి అతడిని పరామర్శించారు. స్థానిక ఎస్సై గంగరాజుతో మాట్లాడి బాధితుడిని దవాఖానకు తరలించేందుకు సహ కరించారు. వెంటనే బాధితుడిని అక్కడి నుంచి స్థానిక దవాఖానకు తరలించి, అడ్మిట్ చేశారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి సేవా గుణానికి పలువురు హర్షం వ్యక్తంచేశారు.