మెదక్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : మెదక్ నియోజకవర్గంలో కారు జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్కు చెందిన నా యకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయా పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. శుక్రవారం హవేళీఘనపూర్ మండలంలోని గాజిరెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద సత్త య్య, ప్రవీణ్, సాయిబాబా, రమేశ్, కిష్ట య్య, అంజయ్య, రాజు, అంబాద్రి, సిద్ధరాములు, కిశోర్, జనార్దన్, మహేశ్, సాయి లు, మహిపాల్, వెంకట్ రాములు, యాదగిరి, తులసీరామ్, రవిలాల్తో పాటు మరో 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి పద్మా దేవేందర్రెడ్డిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్లో చేరుతున్నామని వారు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారాన్నారు. గతంతో పోలిస్తే గ్రామాల్లో అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తున్నదన్నా రు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.