ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం మండలానికి మంజూరు చేసిన 108, 102 వాహనాలను ఆయన చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రభుత్వ దవాఖానల్లో అవసరమైన సిబ్బందిని నియమించడంతోపాటు అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 108,102 వాహనాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
– చేగుంట, ఆగస్టు 5
చేగుంట, ఆగస్టు5: ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పెద్ద పీట వేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంటలోని మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రెండు 108, 102 వాహనాలు శనివారం చేగుంట మండలానికి వచ్చిన సందర్భంగా పూజలు చేసి, జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ దవాఖానలు విస్తరించి, అవసరమైన సేవలు, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారన్నారు.
అత్యవసర సమయంలో పేదలకు వైద్యం అందడం కోసం 108, 102 కొత్త వాహనాలను ప్రభుత్వం అందజేసిందన్నారు. కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాడెం వెంగళ్రావు, సొసైటీ డైరెక్టర్ అయిత రఘు రాములు, ఎంపీడీవో ఆనంద్ మేరి, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ వం టరి కొండల్రెడ్డి, నారాయణరెడ్డి, నాయకులు బక్కి రమేశ్, గాండ్ల నందం, సత్యం, బాల్శివ, నాయకులు వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఉన్నారు.