చేగుంట/ రామాయంపేట/ మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్, సెప్టెంబర్ 12 : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో భక్తిభావన పెరిగిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంట మండలకేంద్రంలోని మెదక్ రోడ్డులో నూ తనంగా నిర్మించిన మహంకాళి ఆలయంలో విగ్రహప్రతిష్ఠాప నోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభా కర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. అమ్మవారి దయతో తెలంగాణ మరిం త అభివృద్ధి చెందుతుందన్నారు. కాగా, గ్రామస్తులు అమ్మవా రికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మీరఘురాములు, మాజీ ఎంపీటీసీ మాసుల పుష్పలత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాడెం వెంగళ్రావు, ఆలయ కమిటీ సభ్యులు ఉసికె శ్రీనివాస్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ చిట్టబోయిన వెంకటేశం, ఆర్యవైశ్య సంఘం పట్టణాధ్యక్షుడు నగేశ్, వాసవి క్లబ్ అధ్యక్షుడు అయిత పరంజ్యోతి, నాయకులు కూన సంతోష్,దుర్గం పవన్కుమార్, సండ్రుగు రవి, పబ్బ నగేశ్, శ్రీకాంత్, ఎర్ర యాదగిరి, సత్యనారాయణ, స్వామి, లింగం పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి భూమిపూజ
చేగుంట మండలం చిన్నశివునూర్ గ్రామం లో వీరహనుమాన్ ఆలయ నిర్మాణానికి సర్పం చ్ కొటారి అశోక్ భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన బోలా రమేశ్ను సర్పంచ్, వార్డు సభ్యులు సన్మానించారు.
తండాలో శ్రావణమాస ఉత్సవాలు
రామాయంపేట మండలం కోనాపూర్ తండాలో మహిళలు శ్రావణమాస ఉత్సవాలు నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ దేవాలయానికి మహిళలు బోనాలతో చేరుకుని జగదాంబికామాతా, సేవాలాల్ మహారాజ్కు సమర్పించారు.
రేణుకా ఎల్లమ్మకు కుంకుమార్చన
మెదక్ పట్టణంలోని రేణుకాఎల్లమ్మ ఆలయంలో ప్రధాన అర్చకుడు వేదవ్యా సు ఆధ్వర్యంలో మహిళలు లక్షా కుంకుమార్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు సురేందర్గౌడ్, గౌడ సంఘం పట్టణా ధ్యక్షుడు కృష్ణాగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కొండన్ సావిత్రి, నేతలు ముత్యంగౌడ్, కృష్ణాగౌడ్, రవిగౌడ్, ప్రవీణ్గౌడ్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
హవేళీఘనపూర్ మండలం ఫరీద్పూర్తండా, చౌట్లపల్లి లోని శుక్లాల్పేటతండాలో సేవాలాల్ ఉత్సవాలు నిర్వహిం చారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గిరిజన మహిళ వేషధారణలో బోనం ఎత్తుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు సిద్ధ్దమ్మ, చెన్నాగౌడ్, శ్రీహరి, ఎంపీటీసీ రాజు, నాయకులు సతీశ్రావు, నరేందర్రెడ్డి, రమేశ్, సిద్ధ్దిరాంరెడ్డి, బ్రహ్మం, శ్రీనివాస్ తదితనులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
ఫరీద్పూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ తోనే గ్రామాల్లో అభివృద్ధ్ది సాధ్యమని ఎమ్మెల్యే తెలిపారు.