గుమ్మడిదల, ఆగస్టు 20: సీఎం కేసీఆర్ వీరశైవలింగాయత్ల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వీరన్నగూడెంలో వీరశైవలింగాయత్ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన వీరశైవలింగాయత్ కల్యాణమండపాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరశైవలింగాయత్ ట్రస్ట్ చైర్మన్ మాడపు వీరమల్లేశ్, కార్యదర్శి గటాటి భద్రప్ప ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు. నూతనంగా నిర్మించిన కల్యాణ మండపంలో నిర్వహించిన శివపార్వతుల కల్యాన్ని భక్తులు తిలకించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయ సమీపంలో బడుగు, బలహీన వర్గాల కోసం అధునాతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ వీరశైవుల కోసం బీసీవర్గంలో చేర్చడంతో పాటు హైదరాబాద్లో బసవేశ్వరుడి విగ్రహంతో పాటు భవనాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకాలను పొరుగు రాష్ర్టాలు కూడా అనుసరిస్తున్నాయన్నారు.
వీరభద్రస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు..
జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయంలో ఎంపీ బీబీపాటిల్ ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీని ఈవో శశిధర్గుప్తా, జూనియర్ అసిస్టెంట్ సోమయ్య శాలువాలతో సన్మానించగా, అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్దన్రెడ్డి, సద్దివిజయాభాస్కర్రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్రెడ్డి, మూడు చింతలపల్లి నరేందర్రెడ్డి, మండలాధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, జంగమ సమాజం అధ్యక్షుడు మడుపతి గణేశ్, వీరశైవలింగాయత్ అధ్యక్షుడు ప్రసాద్, మడుపతి చంద్రశేఖర్, వీరశైవలింగాయత్ అర్చకులు శివనాగులు, శంకరప్ప, నరేశ్, సంతోష్, సర్పంచ్లు ఆలేటి నవీనాశ్రీనివాస్రెడ్డి, మమతావేణు, ఉపసర్పంచ్లు సంజీవరెడ్డి, కుమార్, వీరశైవులు పాల్గొన్నారు.