Infant | మెదక్ అర్బన్ , మార్చి 10: మెదక్ జిల్లాలో పసికందు అమ్మకం ఘటన వెలుగులోకి వచ్చిందని మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపారు. మంగళవారం మెదక్ డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా పరిధిలోని రింగనాయకులపల్లి తండాలో సుమారు 25 రోజుల పసికందును అమ్మినట్టు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ఐసీడీఎస్ అధికారులు, పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు.
అధికారుల వివరాల ప్రకారం ఈ ఘటన ఈ నెల 4వ తేదీన జరిగినట్లు గుర్తించారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో తల్లి పసికందును మరో కుటుంబానికి అప్పగించినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మార్చి 9న పసికందును గుర్తించి అధికారుల ఆధీనంలోకి తీసుకున్నారు.
అనంతరం ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో శిశువుకు వైద్య పరీక్షలు నిర్వహించి సంరక్షణలో ఉంచారు. ఈ ఘటనకు సంబంధించి శిశువు తల్లి, శిశువును తీసుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Bhadradri Kothagudem : కత్తి పట్టిన కలెక్టర్
ఏరియా వర్క్ షాప్లో సిపిఆర్, అగ్నిమాపక యంత్రాల వినియోగంపై అవగాహన
‘గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలి’