Nano Urea | చిలిపిచెడ్, ఆగస్టు 23 : వ్యవసాయంలో నూతనంగా వస్తున్నటువంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని రైతులు అలవర్చుకోవాలని.. అప్పుడే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక పంటల దిగుబడి పెరిగి అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి (DAO) దేవ్ కుమార్ అన్నారు. శనివారం సోమక్కపేట గ్రామంలో రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. నానో యూరియా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి ప్రత్యేక రకమైన ద్రవరూపమైన ఎరువు అని.. దీనివల్ల మొక్కల రంద్రాల ద్వారా పోషకాలు నేరుగా మొక్కలోకి వెళ్లడం ద్వారా పంటలు దిగుబడిపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు.
రైతుకు పంట దిగుబడిలో మంచి ప్రభావం..
క్షేత్రస్థాయిలో రైతులు ముఖ్యంగా రసాయన ఎరువులు అయినటువంటి యూరియాను మోతాదుకు మించి వాడడం ద్వారా నేల కాలుష్యంతోపాటుగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయని, అదే విధంగా సాంప్రదాయ పద్ధతిలో గుళికల రూపంలో వేసినటువంటి ఎరువుల్లో కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే పంట తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మిగతా ఎరువులు వృధాగా పోయే అవకాశం ఉంటుంది. ఈ నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసిన నానో యూరియా విధానంలో పత్ర రంధ్రాల ద్వారా నత్రజని ఎరువులు మొక్కలకు 70 నుంచి 80 శాతం సంగ్రహించడం ద్వారా చెరువుల వినియోగ సామర్థ్యం పెరిగి రైతుకు పంట దిగుబడిలో మంచి ప్రభావం చూపుతోందన్నారు.
ముఖ్యంగా రైతుకు అతి తక్కువ ఖర్చుతో ఈ ద్రవరూప ఎరువులు వాడడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. సాంప్రదాయ యూరియా కంటే చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతుంది కనుక నత్రజని లీచింగ్, నీటి కాలుష్యం, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది. నానో యూరియాను ఎకరాకు ఒక బాటిల్ (500 మి. లీ) పిచికారి చేయాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వ్యవసాయ శాఖ ద్వారా క్షేత్రస్థాయిలో విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డీఏఓ దేవ్ కుమార్, ఏవో రాజశేఖర్ గౌడ్, ఏఈఓలు కృష్ణవేణి, అనిత, శ్రీనివాస్ రెడ్డి, మధు యాదవ్, పాండ్యా, ప్రభు, నర్సింగ్, శంకరయ్య, లక్ష్మణ్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Bibinagar : బీబీనగర్ ఎయిమ్స్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి : పిట్టల అశోక్
Peddapally | యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త శ్యామల
Sanjay Dutt | సంజూ భాయ్ అతడిని అలా కొట్టాడేంటి.. వైరల్ అవుతున్న వీడియో