మెదక్, మే 24 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మంత్రి గంగుల కమలాకర్ను ఫోన్లో కోరారు. బుధవారం ఆయన మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా రోడ్లపై ఉన్న వడ్ల కుప్పలను చూసి ఆవేదన చెందారు. ఆయా గ్రామాల్లోని ధాన్యం ఇంకా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లుల్లోకి ఎందుకు వెళ్లలేదన్న సమస్య గురించి ఆ గ్రామ రైతులను ఎమ్మెల్సీ ఆరా తీశారు. దీంతో ధాన్యం సేకరణలో ఏర్పడుతున్న ఇబ్బందుల గురించి రైతులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సంబంధితశాఖ కమిషనర్ అనిల్ కుమార్తో ఫోన్లో మాట్లాడారు. ధాన్యం సేకరణలో జాప్యాన్ని నివారించి, త్వరగా పూర్తిచేయాలని రైతులకున్న సమస్యలను పరిషరించాలని మంత్రి గంగుల కమలాకర్ను కోరారు.
ధాన్యం సేకరణ విషయంలో ఎకువగా తరుగు తీయడం వంటి రైతులకు నష్టం కలిగించే చర్యలు లేకుండా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్కు ఎమ్మెల్సీ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కలిసి ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రైతులకు నష్టం జరగకుండా, సమయపాలనతో త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ను ఎమ్మెల్సీ కోరారు. జిల్లాలోని ఏదైనా రైస్ మిల్లుల, గోదాముల వద్ద లారీలు అన్ లోడింగ్ కాకుండా రోజుల తరబడి ఆగి ఉండడంతో ఇబ్బంది తలెత్తుతున్నదన్నారు. ప్రకృతి వైపరీత్యాలైన అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా ధాన్యం సేకరించాలని కలెక్టర్ను ఎమ్మెల్సీ కోరారు. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పౌరసరఫరాల, వ్యవసాయ, సెర్ఫ్, సహకార శాఖల అధికారులు ధాన్యం సేకరణ విషయంలో శాయశక్తులా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ అభినందించారు.