రామాయంపేట, జూలై 29 : గ్రామాల్లో దోమల నివారణకు ప్ర త్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, సర్పంచ్ చంద్రకళ తెలిపారు. కోనాపూర్ గ్రామంలో దోమల నివారణకు ప్రతి వీధిలో హైపోక్లోరైడ్ రసాయనాన్ని పారిశుధ్య కార్మికులు పిచికారీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు రసాయన మందు పిచికారీ చేయిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాల్లో నిల్వ నీటిని తొలిగించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దీపక్రెడ్డి, వార్డు సభ్యులు, కార్యదర్శి, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఇమ్మానియేల్ ఉన్నారు.