సంగారెడ్డి, జూలై 19: ఆషాడ మాసంలో గ్రామగ్రామాన జరిగే బోనాల పండుగలు మన సంస్కృతికి ప్రతీకలు అని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానం ఆవరణలోని శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయంలో శాలివాహనులు భక్తిశ్రద్ధలతో బోనాలు తీశారు. అంతకుముందు పట్టణంలోని ప్రభుత్వ అతిథిగృహం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు శాలివాహనులు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్తబల్లోని అమ్మవారికి సమర్పించారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలను సన్మానించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల విందులో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని ఎల్లమ్మ ఆలయంలో గౌడసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, నాయకులు విజయేందర్రెడ్డి, చింత సాయినాథ్, శ్రీధర్రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామప్ప, ఆంజాద్, వాజిద్తో పా టు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.