క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, శివ్వంపేట మండలం సీతారాంతండాల్లో ప్రభుత్వం తరఫున క్రైస్తవులకు ఆమె దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో శాంతిని పెంపొందించి, అందరికీ ప్రేమను పంచేందుకు జన్మించిన పవిత్రమూర్తి ఏసుక్రీస్తు జననం ఒక స్ఫూర్తిదాయకమని, అందరూ ఆయన చూపించిన మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. తెలంగాణ వచ్చాక ప్రతి ఒక్కరూ పండుగలను ఆనందంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు దుస్తులు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. పాస్టర్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నుంచి ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నర్సాపూర్, డిసెంబర్ 21: క్రిస్మన్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పండుగలకు దుస్తుల పంపిణీ ఆనవాయితీగా వస్తున్నదని చెప్పారు. పండుగలకు కొత్త బట్టలు లేవనే లోటును తీర్చడానికి కేసీఆర్ సర్కార్ హయాంలో దుస్తుల పంపిణీని ప్రారంభించామని గుర్తుచేశారు. ఏసుక్రీస్తు మాన వ రూపంలో జన్మించిన దేవుడని, ప్రతిఒక్కరినీ పుణ్యమార్గంలో నడిపించేలా చేశాడన్నారు. తనకు చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్లే అలవాటు ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్గౌడ్, తహసీల్దార్ కమలాద్రి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, సూరారం నర్సింహులు, సాగర్, షేక్హుస్సేన్, పాస్టర్లు పాల్గొన్నారు.