మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 18: అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 373వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ, గౌడ సంఘం ఆధ్వర్యంలో పసుపులేరు ఒడ్డున ఉన్న పాపన్న విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. మెదక్ -నర్సాపూర్ రహదారి డివైడర్ మధ్యలో పాపన్న విగ్రహా ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేశారు. అనంతరం రేణుకాంబ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 350 ఏండ్ల క్రితం మొఘల్ పాలకుల దౌర్జన్యాలకు, నిరంకుశ పాలన, ఆరాచకాలను ఎదురించి తెలంగాణ పౌరుషాన్ని చాటిన యోధుడు పాపన్న అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాపన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గీత కార్మికులకు ఆసరా పింఛన్, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం అందజేస్తున్నదని, గౌడ కులానికి సీఎం కేసీఆర్ ఆన్ని విధాలుగా అండగా ఉన్నారని అన్నారు. అనంతరం గౌడసంఘ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం, ఏడుపాయల ఆలయ చైర్మన్ బాలాగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి శంకర్నాయక్, సహాయ అధికారి నాగరాజుగౌడ్, గౌడ సంఘం పట్టణ అధ్యక్షుడు గడ్డమీది కృష్ణాగౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణగౌడ్, జయరాజ్, శ్రీనివాస్, మాజీ కౌన్సిర్లు ముత్యంగౌడ్, రమేశ్గౌడ్, చంద్రశేఖర్గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ అంజాగౌడ్, గౌడ సంఘం నాయకులు మంగ శ్రావణ్గౌడ్, జనార్దన్గౌడ్, అరవింద్గౌడ్, ప్రవీణ్గౌడ్, ప్రతాప్గౌడ్, రవిగౌడ్, విద్యాధర్గౌడ్, బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులు లింగారెడ్డి, నవీన్, కిరణ్ తదిరులు పాల్గొన్నారు.
పాపన్నపేటలో..
పాపన్నపట్, ఆగస్టు 18: పాపన్నపేట మండలకేంద్రంలో సర్దార్ పాపన్నగౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచులు మూర్తిగౌడ్, నరసింహులు గౌడ్, నాయకులు కిష్టాగౌడ్, బాబా గౌడ్, ప్రవీణ్ గౌడ్, ప్రసాద్ గౌడ్, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేటలో..
రామాయంపేట, ఆగస్టు 18: రామాయంపేట పట్టణంలోని ఎల్లమ్మ ఆలయం ఎదుట సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి రామాయంపేట గౌడసంఘం అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు కన్నాపురం ఈశ్వర్గౌడ్, స్వామిగౌడ్, సత్యనారాయణ గౌడ్, రాజుగౌడ్, రామాగౌడ్, ఎల్లాగౌడ్, నగేశ్గౌడ్, యాదగిరిగౌడ్, శ్రావణ్గౌడ్, నాగరాజు పాల్గొన్నారు.
కొల్చారంలో..
కొల్చారం, ఆగస్టు 18: కొల్చారం మండల కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని గౌడ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గౌడ సంఘం మండల అధ్యక్షుడు నాయిన్ వెంకట్గౌడ్, ఎస్సై మహ్మద్ గౌస్, ఎంపీడీవో గణేశ్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముత్యంగారి సంతోష్కుమార్, కొరబోయిన కాశీనాథ్, కొల్చారం సొసైటీ చైర్మన్ మనోహర్, ఏడుపాయల డైరెక్టర్ యాదాగౌడ్, నాయకులు శేఖర్గౌడ్, రామకృష్ణగౌడ్, రాజాగౌడ్, అశోక్గౌడ్, దుర్గాప్రసాద్గౌడ్, సురేశ్గౌడ్, మహేశ్గౌడ్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చిలిపిచెడ్లో..
చిలిపిచెడ్, ఆగస్టు 18: చిలిపిచెడ్ మండల కేంద్రంలో గౌడ సంఘం సభ్యులు సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంతారం సర్పంచ్ అశోక్గౌడ్, గౌడ సంఘం మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్గౌడ్, నాయకులు కిష్టాగౌడ్, సుధాకర్గౌడ్, రవీందర్గౌడ్, యాదాగౌడ్, రామాగౌడ్, లింగాగౌడ్, రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వెల్దుర్తిలో..
వెల్దుర్తి, ఆగస్టు 18: బహుజనుల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేసిన వీరుడు సర్వాయి పాపన్న అని గౌడ సంఘం నాయకులు ముత్తాగౌడ్, సుధాకర్గౌడ్, కృష్ణాగౌడ్ అన్నారు. వెల్దుర్తి మండలకేంద్రంలోని ఎల్లమ్మ ఆలయం ఎదుట పాపన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు సంజీవ్గౌడ్, దుర్గాగౌడ్, కిష్టాగౌడ్, శివ్వాగౌడ్, భిక్షపతిగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
నిజాంపేటలో..
నిజాంపేట, ఆగస్టు 18: మండలకేంద్రంలోని బస్టాండ్ ఎదుట గౌడ సంఘం సభ్యులు సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు సిద్ధాగౌడ్, స్వామిగౌడ్, శ్రీనివాస్గౌడ్, చిరంజీవిగౌడ్, నారాగౌడ్, వెంకట్గౌడ్, రాములుగౌడ్, రైతు బంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్ చంద్రం తదితరులు పాల్గొన్నారు.
పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట, ఆగస్టు 18: మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ చిత్రపటానికి ఎంపీపీ జంగం శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ సురేష్గౌడ్, ఎంపీటీసీ వీణాసుభాశ్గౌడ్, సర్పంచులు విఠల్గౌడ్, శంకర్గౌడ్, నాయకులు పెరుమాల్గౌడ్, సురేందర్గౌడ్, భానుగౌడ్, సతీశ్గౌడ్ పాల్గొన్నారు.
శివ్వంపేటలో..
శివ్వంపేట, ఆగస్టు 18: తెలంగాణ బహుజన ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని శివ్వంపేట గౌడసంఘం మండల నాయకులు అన్నారు. శివ్వంపేటలో పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు రమణాగౌడ్, మండల అధ్యక్షుడు కొడకంచి రవీందర్గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు చంద్రాగౌడ్, పత్రాల శ్రీనివాస్గౌడ్, కొడకంచి శ్రీనివాస్గౌడ్, నటరాజ్గౌడ్, బుర్ర మహేశ్గౌడ్, బాసంపల్లి పోచాగౌడ్, కొడకంచి సుదర్శన్గౌడ్, కొడకంచి నర్సింహులుగౌడ్, అనూషాఅశోక్గౌడ్ పాల్గొన్నారు.
తూప్రాన్లో..
తూప్రాన్, ఆగస్టు 18: తూప్రాన్ మండలకేంద్రంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి గౌడ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్ శ్రీశైలంగౌడ్, మల్లికార్జున్ గౌడ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్లో..
నర్సాపూర్, ఆగస్టు 18: నర్సాపూర్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా గౌడ సంఘం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్గౌడ్, సభ్యులు ఆంజనేయులుగౌడ్, మల్లేశ్గౌడ్, శ్రీనివాస్గౌడ్, రమేశ్గౌడ్, చెంది శ్రీనివాస్గౌడ్, సత్యంగౌడ్, రాజుగౌడ్, రాకేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కౌడిపల్లిలో..
కౌడిపల్లి, ఆగస్టు 18: కౌడిపల్లి మండలకేంద్రంలో సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి గౌడ సంఘం మండల అధ్యక్షుడు బాలగోని సంతోష్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.