రామాయంపేట, ఏప్రిల్ 16 : రాజ్యాంగం రాసిన మహాపురుషుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శం గా తీసుకుని ముందుకు సాగాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలోని జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా పోటీల్లో విజయం సాధించిన జట్టులకు నగదు బహుతులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. దళితుల ఆశాజ్యోతి, పీడత ప్రజల కోసం అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనందరికీ ఆదర్శమన్నారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3వల్లనే చిన్న రాష్ర్టాల ఏర్పాటు వివ రించారని తెలిపారు. దాని మూలంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. సీఎం కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. నేడు ప్రభుత్వ ఫలాలు ఇంటింటికీ దక్కుతున్నాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల పోటీల్లో రాణించాలన్నారు. క్రీడారంగంలో ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆటలు ఆడడాన్ని అలవవర్చు కోవాలని సూచించారు. వాలీబాల్ పోటీల్లో గెలిచిన క్రీడాజట్ల కు ప్రథమ, ద్వితీయ బహుమతులను ఎమ్మెల్యే అందజే శారు. కార్యక్రమంలో ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, సర్పంచ్ దోమ చంద్రకళ, స్థానిక నాయకుడు ఇమ్మానియేల్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
బాధితులను ఆదుకుంటా : ఎమ్మెల్యే
పాపన్నపేట, ఏప్రిల్ 16 : ఇటీవల ఈదురుగాలులతో దెబ్బతిన్న గృహాల యజమానులను ఆదుకుంటామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మండ లంలో పర్యటించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల ఈదురు గాలులతో పలువురు ఇంటి పైకప్పులు ధ్వం సమయ్యాయి. ఇండ్లతోపాటు పంటలను నష్టపోయిన బాధి తులను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సోంలా తండా, అమీర్యతండాకు వెళ్లి, బాధితులను పరామర్శించా రు. ఈ సందర్భంగా ఏడుగురుగు బాధితులకు రూ.5వేల చొ ప్పున ఆర్థికసాయం అందజేశారు. కొత్తగా 36 కరెంట్ స్తంభా ల ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపించాలని అధికారులను ఆదేశించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5లక్షలు మం జూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్లు కిషన్, కుమ్మరి జగన్, గురుమూర్తిగౌడ్, నవీన్, కిష్టయ్య, తిరుపతి, ఎంపీటీసీలు సరస్వతి, వెంకటేశం, ఏడుపాయల ఆల య పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్, తహసీల్దార్ మహేందర్, నాయకులు దత్తు, గంగ్యానాయక్, పూల్సింగ్ ఉన్నారు.