భైంసా, ఆగస్టు 10 : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పలు చౌరస్తాలలో రాత్రివేళ నడిరోడ్డుపై పశువులు తిష్ట వేయడంతో వాహనదారులకు కష్టంగా మారుతున్నది. గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపైకి ఒక్కసారిగా దూసుకురావడంతో పాదచారులు పరుగులు పెడుతున్నారు. వాహనాలను ఢీకొనడంతో అదుపుతప్పి కింద పడుతున్నారు. రాత్రివేళ వాహనదారులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు పనులు ముగించుకొని హడావుడిగా వెళ్తున్న క్రమంలో రహదారులపై పశువులను గమనించక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
పగలు చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది, యజమానులు పట్టించుకోకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పశువులు రహదారులపై ఉండకుండా చూడాలని సంబంధిత అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు.