మెదక్ అర్బన్/ మెదక్ రూరల్/ చిన్నశంకరంపేట/ రామాయంపేట/ చేగుంట/ కొల్చారం, సెప్టెంబర్ 27 : మెదక్ పట్టణం నర్సిఖేడ్లో జరిగిన వినాయక నిమజ్జనంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాటలు పాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద కుటుంబ సమేతంగా మెదక్ పట్టణంలోని పంచముఖి గణేశ్ మండపం వద్ద వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ మండలంలో బుధవారం ఆయా గ్రామాల్లో ్జగణపయ్యలను ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కొంటూరు చెరువులో వినాయకులను నిమజ్జనం నిర్వహించారు.
చిన్నశంకరంపేట మండలంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అంబాజిపేటలో కుంకుమార్చన చేశారు. రామాయంపేటలో వినాయక మండపాల వద్ద లడ్డూలను వేలం వేశారు. కేసీఆర్ కాలనీలోని వినాయకుల లడ్డూ లను కాలనీకి చెందిన దాసరి వెంకటి రూ.5వేలు, అనిల్కు మార్ రూ.3600 దక్కించుకున్నారు. కొల్చారం మండలంలో గణనాథుడి శోభాయాత్ర శోభాయమానంగా జరిగింది. ఎస్సై మహ్మద్గౌస్ బందోబస్తు చర్యలు తీసుకున్నారు.