జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో తనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చారని, దానిని నిలబెట్టుకుంటానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని భారీ విజయం సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేకు దిశానిర్దేశం చేశారు.
– జహీరాబాద్, ఆగస్టు 24