జహీరాబాద్, మార్చి 25 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు లేక రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోలేక పోతున్నారని, పండిన వెంటనే తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థి తి నెలకొందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనిం టి మాణిక్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం అసెంబ్లీ బడ్జెట్ ప్రశ్నోత్తరాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోజకవర్గంలో ఎర్రమట్టి భూములు అధికంగా ఉండడంతో కోహీర్, జహీరాబాద్ మండలాల పరిధిలోని రైతులు అల్లం, పసు పు, అలుగడ్డ పంటలు ఎక్కువగా సాగుచేస్తారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఆ పంటలను అమ్ముకునేందుకు హైదరాబాద్లోని బోయినిపల్లి, ఓల్డ్సీటీకి మార్కెట్లకు తరలించాల్సి వస్తున్నదని తెలిపారు.
ఆ పంటలు నిల్వచేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీ, గిడ్డంగులు స్థానికంగా లేకపోవడంతో సరైన ధర లభించక రైతుల ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచన చేయాలని కోరా రు. జహీరాబాద్ లేదా కోహీర్లో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో అధికంగా రైతులు చెరుకు తోటలు సాగుచేస్తారని, తక్కువ నీటితో అధిక దిగుబడులు రైతులకు డ్రిప్ పరికరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.