సిద్దిపేట అర్బన్, జనవరి 21: అన్నిరంగాల్లో సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తున్నదని, పదో తరగతి ఫలితాల్లో విదార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆకాంక్షించారు. ని యోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆదివారం ఉత్తరాలు రాశారు. మార్చి 18 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆత్మవిశ్వాసం నింపే లా, విద్యార్థులకు మనోధైర్యం ఇచ్చేలా ఉత్తరం రాశారు. పిల్లలను ఇంటి వద్ద శ్రద్ధగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించా రు.
ఈ రెండు నెలలు టీవీలు, సెల్ఫోన్లు చూడకుండా చదువుకోవాలని ఉత్తరంలో పేర్కొన్నారు. పిల్లలను విందు వినోదాలు, ఫంక్షన్స్కు దూరంగా ఉంచాలని సూచించా రు. తన వంతుగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులతోపాటు సాయంత్రం వేళలో అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కష్టం గా కాకుండా ఇష్టంగా చదివించండి.. మీ పిల్లల బంగారు భవితకు బాటలు వేయం డి.. అది మీ చేతుల్లోనే ఉందన్నారు. నియోజవకవర్గలోని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు హరీశ్రావు ఉత్తరం ఆత్మవిశ్వాసం నింపేలా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.