సిద్దిపేట అర్బన్, మార్చి 17: నేటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించామని, ఇందుకు విద్యాశాఖ యంత్రాంగంతో కలిసి సమీక్ష నిర్వహించి, అన్ని వసతులు కల్పించామని తెలిపారు.
‘కష్టపడి చదివారు.. మీ కష్టం వృథా కాదని.. మీ భవిష్యత్కు పునాది పదో తరగతి.. ఇష్టపడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి’.. అని పిలుపునిచ్చారు. ఉత్తమ ఫలితాలు సాధించి వందశాతం ఉత్తీర్ణత సా ధించాలని ఆకాంక్షించారు. మంచి మార్కు లు సాధించిన వారికి బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు పొంది ఉన్నత విద్య చదువుతున్నారని, గత రెండేండ్లలో ఉత్తీర్ణతలోనూ, ట్రిపు ల్ ఐటీ సీట్లు సాధించడంలో సిద్దిపేట జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ స్థానాన్ని నిలబెట్టుకొని ముందుతరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. మీరంతా ఏకాగ్రతతో పరీక్షలు రాసి అద్భుతమైన ఫలితాలు సాధించాలని కోరుతున్నట్లు తెలిపారు.