పటాన్చెరు, డిసెంబర్ 28: ప్రజాపాలనతో ప్రజలు లబ్ధి పొందాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తే స్వాగతిస్తామన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాలు అర్హులందరికీ అందాలన్నారు. అర్హులందరూ తప్పకుండా దరఖాస్తు చేయాలని సూచించారు. ఆరు గ్యారెంటీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని పథకాలు లబ్ధిదారులకు అందజేయాలన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని, దరఖాస్తులు నింపడంలో ప్రజలకు సాయం చేయాలని కోరారు. పారదర్శకమైన విధానానికి మద్దతు ఇస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, బీఆర్ఎస్పట్టణాధ్యక్షుడు అఫ్జల్, నేతలు పాల్గొన్నారు.