అమీన్పూర్, మే 5: అబద్ధాల హామీల పునాదులపై గద్దెనెకిన కాంగ్రెస్కు లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఏఆర్ బృందావన్ కాలనీ, బృందావన్ టీచర్స్ కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఆయా కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు అని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిన అధికార కాంగ్రెస్ను ప్రశ్నిస్తే లోక్సభ ఎన్నికలకు ముడి పెట్టడం కాంగ్రెస్ నైజానికి అద్దం పడుతున్నదని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీలు అమలు కావాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ మెజార్టీ అందించాలని కోరారు. నాలుగేండ్లలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ప్రతి ఒకరికీ సంక్షేమ పథకాలు అందించి ఆర్థిక స్వావలంబన అందించి అండగా నిలిచామన్నారు. ఉన్నత విద్యావంతుడు, ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రామచంద్రాపురం, మే 5: ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ ముందుంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. భారతీనగర్ డివిజన్లోని ఎల్ఐజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్స్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. బీహెచ్ఈఎల్ పరిశ్రమలో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పెన్షనర్లకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ పెన్షన్లను మంజూరు చేయించామని గుర్తుచేశారు. 247మంది పెన్షనర్లకు పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ, మ్యాక్సొసైటీ, బీడీఎల్ కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఉన్నత విద్యావంతుడైన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధికి మరిన్ని నిధులు అందుతాయని చెప్పారు. భవిష్యత్తులోను పెన్షనర్లకు అండగా ఉంటామని, మే13న జరిగే ఎన్నికల్లో కారుకు ఓటు వేసి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సతీమణి ప్రణీతరెడ్డి, నాయకులు ఆదర్శ్రెడ్డి, నగేశ్, పరమేశ్, అంజయ్య, సత్యనారాయణ, నారాయణరెడ్డి, బూన్, యాదగిరిరెడ్డి, వైకుంఠరావు, ఫహీం, ఇక్బాల్, రామారావు తదితరులు పాల్గొన్నారు.