రామచంద్రాపురం, అక్టోబర్ 30: బీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతున్నది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ప్రజలు మెచ్చి స్వచ్ఛందంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన యువత, పెద్దలు పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్లతోపాటు తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన పలువురు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదివారం రాత్రి ఆర్సీపురం డివిజన్లోని ఎస్సీ బస్తీకి చెందిన, భారతీనగర్ డివిజన్ ఎల్ఐజీకి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బల్లా చరణ్, శంకర్, అనిరుద్, ప్రశాంత్, సాయి, వినోద్ ఆధ్వర్యంలో పలువురు యువకులు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తెల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటయ్యగౌడ్, వెంకటస్వామిగౌడ్, రమేశ్గౌడ్, కౌన్సిలర్ జ్యోతిశ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్కాలనీ, కొమురంభీమ్ కాలనీలకు చెందిన రాజేశ్, రాజు, సుమన్, నంద, రాహుల్, వినయ్, గోపి, శివ, వెంకటసాయి, తిరుమల, అభినయ్, సాయికృష్ణలతోపాటు వందమంది బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ కష్టసుఖాల్లో పాలుపంచుకోలేని కాంగ్రెస్, బీజేపీల నాయకులు ఎన్నికల సమయంలో అండగా ఉంటామంటూ నయవంచక మాటలు చెప్పడం వారి పనితీరుకు నిదర్శనమన్నారు. పదేండ్ల కాలంలో ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు అందించడంతోపాటు ప్రతి వార్డులో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ప్రజలు ప్రగతిని గమనించిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోతే గోసపడుతామని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నికల ప్రజాసంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్పానగేశ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, వైస్చైర్మన్ రాములుగౌడ్, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్యాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, కౌన్సిలర్ బాబ్జీ, నాగరాజు, కోఆప్షన్ సభ్యుడు శ్రీపాల్రెడ్డి, నాయకులు ఆదర్శ్రెడ్డి, కుమార్గౌడ్, ఐలేశ్, విజయభాస్కర్రెడ్డి, ఇంద్రారెడ్డి, గోపాల్, విష్ణు, యాదగిరి, సునీల్, నర్సింహ, గూడెం విక్రమ్, రాకేశ్, కృష్ణకాంత్, గఫర్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.