సంగారెడ్డి, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, హక్కుల కోసం పోరాడుదామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మబలిదానం చేసుకోవడం తీవ్రంగా కలిచివేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆర్టీసీలో ఇలాం టి పరిస్థితి వచ్చి శంకర్గౌడ్ ఆత్మ బలిదానానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి రేవంత్ మాట తప్పారని విమర్శించారు. పీఆర్సీ, హామీలు అమలు చేయకుండా రేవంత్రెడ్డి కాలయాపన చేస్తున్నాడని మండిపడ్డారు.