సంగారెడ్డి మార్చి 14(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమా ధానం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్న.. ప్రభు త్వం స్పందించకపోవటం దారుణమన్నారు. నిజామాబాద్లో ఆటోడ్రైవర్ స్వామి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం విషాధకరమన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఆటో డ్రైవర్లకు భరో సా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇదివరకే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు రూ. 10లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా ఆటోకార్మికులకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేయాలన్నారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రభు త్వం వెంటనే ఆటోడ్రైవర్లను ఆదుకోవాలని లేదంటే వారి పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆటోడ్రైవర్ల ఆత్మహత్య నిలువరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్.వెంకటేశ్వర్లు, గోవర్థన్నాయక్, మధుసూదన్రెడ్డి, జి.వి.శ్రీనివాస్, మజీద్ పాల్గొన్నారు.