సంగారెడ్డి, మార్చి 6: మాయమాటలతో ప్రజలను వంచించడమే కాంగ్రెస్పార్టీ నైజమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దుయ్యబట్టారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేస్తామని, ఇప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోర్టులో కేసు వేసిన విషయం మార్చిపోయి మార్చి చివరిలోగా ఎల్ఆర్ఎస్ కట్టాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు ఒకమాట, వచ్చాక మరోమాట మాట్లాడడంతో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం భయటపడిందన్నారు.
అన్నదాతలకు పంట పెట్టుబడి సాయాన్ని ఇంతవరకు అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వం, రుణమాఫీని ఒకేసారి చేస్తామని ప్రకటించి పక్కన పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 420 హామీలు, 6గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రభుత్వ పనితీరును రుజువు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్పై 26.44 లక్షల దరఖాస్తులు పెండింగ్లో పెట్టేందుకు కోమటిరెడ్డి కోర్టులో కేసు వేసి నిలిపివేశారన్నారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జడ్పీటీసీ కొండల్రెడ్డి, ఎంపీపీ యాదమ్మ, నాయకులు జైపాల్రెడ్డి, నరహరిరెడ్డి, రాజేశ్వర్రావు దేశ్పాండే, బీరయ్యయాదవ్, ఆత్మకూర్, శివరాజ్ పాటిల్, నగేశ్ మల్లాగౌడ్, మధుసూదన్రెడ్డి, పండల పాండురంగం, మాజీ సర్పంచ్ మోహన్నాయక్, కసిని శ్రీకాంత్, వెంకటేశం, ఆజీమ్ పాల్గొన్నారు.