నర్సాపూర్/ చిలిపిచెడ్/ కొల్చారం/ శివ్వంపేట, డిసెంబర్ 25 : ఏసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాల తో ఉండాలని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని నర్సాపూర్లోని సీఎస్ఐ, జీవ జలముల చర్చిని ఎమ్మెల్యే సందర్శించి, క్రిస్మస్ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎమ్మెల్యే మదన్రెడ్డిని ఆశీర్వదించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం క్రిస్టియన్ల సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. ఆయా కార్యక్రమాల్లో పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు పైడి శ్రీధర్గుప్తా, జగదీశ్, పాస్టర్ దేవదాసు, క్రిస్టియన్లు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ అన్నిమతాలకు సమప్రాధాన్యత ఇస్తున్నా రని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శివ్వంపేటలోని మగ్దుంపూర్ చర్చి, బేతని సంరక్షణాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో క్రిస్మస్ సంబురాలు నిర్వహించారు. సీతారాంతండాలో మహిళలకు సర్పంచ్ సోనీరవినాయక్ చీరలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షు డు రమణాగౌడ్, సర్పంచ్లు ఫణిశషాంక్శర్మ, సోము అశోక్, ఎంపీటీసీ నువ్వుల దశరథ్, కోఆప్షన్ సభ్యుడు లాయక్, నేతలు వేణుగోపాల్రెడ్డి, పిట్ల సత్యనారాయణ, సూర్యంచౌహాన్, భిక్షపతి, సాజీవర్గీస్, విన్సెంట్, వీరబాబు ఉన్నారు చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్, చండూర్, గంగారం, సోమక్కపేట, గౌతాపూర్లోని చర్చిల్లో ప్రార్థనలు చేశారు.
ఏసుప్రభు అందరివాడు : పాస్టర్ డేవిడ్
రామాయంపేట/ నిజాంపేట, డిసెంబర్ 25 : రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రామాయంపేటలోని సీఎస్ఐ చర్చిలో పాస్టర్ రెవ డేవిడ్ సంబురాలు నిర్వహించారు. ఆపత్కాలంలో రక్షించేది యేసయ్య అని, ఏసుప్రభువు అందరి వాడన్నారు. కోనాపూర్, డి.ధర్మారం, కాట్రియాల గ్రామాల్లో ప్రార్థనలు చేశారు. కార్యక్రమాల్లో పాస్టర్లు సత్యానందం, సాల్మన్రాజు, విద్యాసాగర్, సుశీల్, నవీన్త్న్రాకర్, రమేశ్, రవీందర్, కోనాపూర్ పీఏసీఎస్ చైర్మన్ కరికె విజయలక్ష్మి, నాయకులు కట్ట ప్రసాద్, సంపత్కుమార్, మరియా, రూత మ్మ, ఇమ్మానియేల్, శ్రీనివాస్, సర్పంచ్ జ్యోతి ఉన్నారు.
నిజాంపేట మండలంలోని నందిగామలో సర్పంచ్ ప్రీతి దంపతులు మహిళలకు చీరలను అందజేశారు. జడ్పీటీసీ పంజా విజయ్కుమార్ చర్చిలకు కేక్లను పంపిణీ చేశారు.
దైవ సందేశాలను వినిపించిన పాస్టర్లు
మెదక్ రూరల్/ పెద్దశంకరంపేట/ చిన్నశంకరంపేట/ టేక్మాల్, డిసెంబర్ 25 : మెదక్ మండలంలో క్రిస్మస్ వేడుక లు ఘనంగా జరిగాయి. క్రెస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేవ సందేశాన్ని చర్చి ఫాదర్స్ వినిపించారు.
పెద్దశంకరంపేట పట్టణంతోపాటు మండలంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. చర్చిలను రంగురుంగుల విద్యుత్దీపాలతో అలంకరించారు. పెద్దశంకరంపేట సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ విశిష్టత, ఏసుక్రీస్త జననం, పండుగ విశిష్టతను పాస్టర్లు వివరించారు. కార్యక్రమంలో టెంకటి సర్పంచ్ సుధాకర్, పాస్టర్ దేవవరం, సీఎస్ ఐ చర్చి బాధ్యులు చార్లెస్ వాకర్, పద్మారావు, ఆల్ప్రైడ్ రాజు, పౌలు, మాణిక్యం, సంతోష్, మిట్టు, శైలజా వాకర్ ఉన్నారు. చిన్నశంకరంపేట చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు.
క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
టేక్మాల్ మండలకేంద్రంలోని చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడు కలకు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హాజరయ్యారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరూ సోదరాభా వంతో మెలగాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాశ్, సర్పంచ్ సుప్రజాభాస్కర్, ఎంపీపీ చింత స్వప్నారవి, మైనార్టీ హక్కుల సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఏ సలీం పాల్గొన్నారు.