ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెరతీసిందని, ఆరు హామీలు ప్రకటించి ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నదని సంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ విమర్శించారు. గురువారం కల్హేర్ మండలంలోని రాపర్తి, మార్డి, ఫత్తేపూర్, బీబీపేట్ గ్రామాల్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో కలసి పర్యటించారు. సీసీ రోడ్లు, ఫార్మేషన్ రోడ్డు, బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి, గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయడంతో వెనుకబాటుకు గురైందన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తించాలన్నారు. తొమ్మిదేండ్లలో గల్లీగల్లీకి సీసీ రోడ్డు వేశామన్నారు. కాంగ్రెస్ ఇస్తున్న ఆరు హామీలు ప్రజాధనాన్ని దోచుకునేందుకేనని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆరోపించారు. నల్లవాగు ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు వరకు నీటిని అందించడంతో రైతులు రెండు పంటలు పండిస్తున్నారన్నారు. – కల్హేర్, సెప్టెంబర్ 28
కల్హేర్, సెప్టెంబర్ 28 : వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు మోసపూరిత వాగ్ధానాలతో రాజకీయ లబ్ధికి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, వారి హా మీలను నమ్మితే నట్టెట మునిగినట్లేనని జడ్పీచైర్పర్సన్ మం జుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. కల్హేర్ మండలంలోని రాపర్తి, కల్హేర్, మార్డి, ఫత్తేపూర్, బీబీపేట్ గ్రామాల్లో గురువారం జడ్పీ చైర్ పర్సన్తోపాటు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పర్య టించారు. ఆయా గ్రామాల్లో చేపట్టనున్న సీసీరోడ్లు, ఫార్మేషన్ రోడ్డు, బీటీరోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. గృహలక్ష్మి లబ్ధ్దిదారులకు ధ్రువపత్రాలను పంపిణీ చేశారు.
ఆయా కార్యక్రమాల్లో జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ మాట్లాడుతూ.. ఎనిమిదేండ్ల క్రితం నారాయణఖేడ్ నియోజకవర్గం ఎలా ఉంది? ప్రస్తుతం ఏలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో దోపిడి, దొంగతనాలు ఉండేవని, వారు అవలంభించిన విధానాలతో నియోజకవర్గం అన్ని రం గాల్లో వెనుకబాటుకు గురైందని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మొద్దని, సీఎం కేసీఆర్ అమ లు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని బేరీజు వేసుకోవాలన్నారు. ఆడబిడ్డ పుట్టిననాటి నుంచి పెండ్లి అయ్యేవరకు సీఎం కేసీఆర్ చేయూత ఇస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు గ్రామాల్లో రోడ్లన్నీ మట్టి, బురదమయంగా ఉండేవన్నారు. ఎనిమిదేండ్లల్లో ప్రతి గ్రామానికి రోడ్డు, ప్రతి వీధిలో సీసీరోడ్డు నిర్మించారని వివరించారు. ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రజలతో మమెకమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆయన్ను గెలిపించాలని కోరారు.
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్న ఆరు గ్యారంటి పథకాలతో ప్రజాధనాన్ని దోచుకోవడానికేనన్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల రుణాల ను బినామీ పేర్లతో కాంగ్రెస్ నాయకులు దొచుకున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఇందిరమ్మ ఇంటి రుణాలను మాఫీ చేయకపోతే కాంగ్రెస్ నాయకులు రుణాలు చెల్లించాల్సిన దు స్థితి వచ్చేదన్నారు. కాంగ్రెస్ పాలనలో దోపిడి, దౌర్జన్యాలు, హత్యలు ఉండేవని, మాయమాటలతో ప్రజలను మోసం చేశారని విమర్శిచారు. పొమ్యానాయక్ తండాకు బీటీ రోడ్డు పనులను నాణ్యతా లోపంతో నిర్మించడంతో కొన్నాళ్లకే రోడ్డు మొత్తం గుంతలమయంగా మారిందని తెలిపారు.
నల్లవాగు ప్రాజెక్టు నీటిని చివరి ఆయకట్టుకు అందించడం లో కాంగ్రెస్ నాయకులు విఫలమయ్యారని విమర్శించారు. ‘ఖేడ్’ నియోజకవర్గంలో నాలుగేండ్ల్లుగా చివరి ఆయకట్టుకు నీరందించడంతో రైతులు రెండు పంటలను పండిస్తున్నారని తెలిపారు. గతంలో వానకాలం వస్తే కల్హేర్ మండలానికి చేరుకోవాలంటే వాగులు, వంకల్లో వరద ఉధృతి తగ్గిన తర్వాత వచ్చేవారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వంతెనలు, కల్వర్టులు నిర్మించి, రవాణా వ్యవస్థను మెరుగుపర్చారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా ప్రతి ఇంటికీ బీఆర్ఎస్ ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్నారు.
భవిష్యత్తోపాటు అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి అధికారమిస్తే దోచుకుంటా రని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ సంపద పెంచి ప్రజలకు పంచి ఇస్తున్నారని, కండ్ల ఎదుట కనిపించే సంక్షేమాభివృద్ధిని గమనించి సీఎం కేసీఆర్కు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నర్సింహరెడ్డి, ఎంపీపీ గుర్రపు సుశీల, ఆత్మకమిటీ చైర్మన్ రాంసింగ్, వైస్ఎంపీపీ నారాయణరెడ్డి, జిల్లా, మండల కో ఆప్షన్ సభ్యులు అలీ, ఘని, సర్పంచ్లు శ్రావణ్కుమార్, కిష్టారెడ్డి, బాచేపల్లి, కల్హేర్ పీఏసీఎస్ చైర్మన్లు సంగారెడ్డి, గంగారెడ్డి, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు సంతోష్కుమార్, ఎంపీటీసీ సంగప్ప, ఎంపీడీవో సంగ్రామ్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.