బీసీ కులవృత్తులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, అర్హులైన వారందరికీ రూ.లక్ష సాయం అందిస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఎమ్మెల్యే రూ. లక్ష ఆర్థిక సాయం చెక్కులను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని, సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయన్నారు. గృహలక్ష్మీ పథకం కింద 2500 ఇండ్లు కట్టడం జరుగుతుందని, మరో మూడు వేల ఇండ్లు మంజూరయ్యే అవకాశంముందని పేర్కొన్నారు. జహీరాబాద్ పట్టణంలోని పద్మశాలి భవనంలో ఎమ్మెల్యే మాణిక్రావు నియోజకవర్గంలో ఎంపిక చేసిన 300 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ప్రభుత్వం అందించిన సాయంతో కులవృత్తులను అభివృద్ధి చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని పిలుపు నిచ్చారు.
-మెదక్ (నమస్తే తెలంగాణ)/ జహీరాబాద్, ఆగస్టు 10
మెదక్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : ఇదీ ఆరంభమే.. ప్రక్రియ ప్రారంభమైంది.. అర్హులైన వారందరికీ రూ. లక్ష సాయం అందిస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. గురువారం మెదక్ కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ కుల వృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హాజరై మాట్లాడారు.
మెదక్ నియోజకవర్గంలోని మెదక్అర్బన్, మెదక్ రూరల్, పాపన్నపేట, నిజాంపేట, రామాయంపేట, రామాయంపేట అర్బన్, చిన్నశంకరంపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో బీసీ కుల వృత్తిదారులకు రూ. లక్ష ఆర్థికసాయం అంద జేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన తరగతుల్లో వృత్తిదారులు నైపుణ్యతను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తున్నదన్నారు.
సీఎం కేసీఆర్ అభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 61 ఏండ్లు ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు చేసింది శూన్యమని, తెలం గాణలో కేవలం తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు, రైతుబీమా, రైతు బం ధుతోపాటు కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు అందజేస్తున్నారని, మిషన్ కాకతీయ పథకంలో చెరువులన్నీ పునరుద్ధరించడంతో రెండు పంటలు పండుతున్నాయని తెలిపారు. రైతులు పం డించిన పంటలకు గిట్టుబాటు ధర ఇస్తూ పల్లెల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల ను నిజాంసాగర్ వరకు తెచ్చి మూడు పంటలు పండే విధం గా సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగా నికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రెసిడెన్షియల్ స్కూల్స్, వైద్య కళాశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల వస్తుంద న్నారు. గొల్లకురుమలు, మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అన్నారు. గృహలక్ష్మిలో 2500 ఇంటి నిర్మాణాలకు ఆర్థికసాయం ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మొత్తం 3 వేల ఇండ్ల్ల నిర్మాణాలకు ఆర్థికసాయం చేస్తామన్నారు. రైతు రుణ మాఫీపై సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.
వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి
వెనుకబడిన తరగతుల్లోని కుల వృత్తిదారులు తమ వృత్తి నైపుణ్యా లు పెంపొందించుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ప్ర భుత్వం కుల వృత్తులను ప్రోత్సహించడానికి రూ.లక్ష చొప్పున 280మందికి ఆర్థికసాయం అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి కార్మికుడు కార్మిక చట్టాలను తెలుసుకోవాలన్నారు. సంఘటి త, అసంఘటిత కార్మికులు బీవోసీ లేబర్కార్డు తీసుకోవాలని, కార్డు ఉంటే ఉచిత వైద్యం లభిస్తుందన్నారు. బీవోసీ లేబర్కార్డు పొందడానికి కార్మికశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ లావణ్యారెడ్డి, అదనపు కలెక్టర్ రమేశ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, బీసీడబ్ల్యూవో శంకర్, అసిస్టెంట్ బీసీడబ్ల్యూవో మంగ నాగరాజు, పీఏసీఎస్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.