‘ఔర్ ఏక్ దకా… దేడ్ లాక్ పకా’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట, గజ్వేల్లో మంగళవారం నియోజకవర్గాల స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రేమతో ప్రజలను ఓటు అడిగి మ్యానిఫెస్టోను వివరించాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. అభివృద్ధి అంటే సిద్దిపేటేనే అన్న ప్రతిపక్ష నాయకులు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్రెడ్డికి అండగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. గజ్వేల్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేది, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేది కేసీఆరేనని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
సిద్దిపేట, అక్టోబర్ 31: సిద్దిపేట ప్రజల గౌరవాన్ని నిలబెడుదాం.. చేసింది చెబుదాం.. ప్రజలు కోరే అభివృద్ధి చేసుకున్నాం.. ప్రేమతో ప్రజలను ఓటు అడగండి.. మ్యానిఫెస్టోను వివరించండి.. అని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో మంగళవారం పద్మనాయక, బాలాజీ గార్డెన్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాలకు ఓటు అడిగే నైతిక హకు లేదన్నారు. సిద్దిపేటలో మనకు ఏపార్టీతో పోటీ లేదని.. మనకు మనకే పోటీ అన్నారు. ఎకువ శాతం ఓట్లు తెచ్చిన మండలానికి బహుమతి ఇస్తాన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదన్నారు. కేసీఆర్ బీమాతో కోటి కుటుంబాలకు ధీమా అందబోతున్నదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న దుర్భర పరిస్థితుల గురించి ఓటర్లకు చెప్పాలన్నారు. ఛత్తీస్గడ్లో ఎకరాకు 13 క్వింటాళ్ల వరకే కొంటారు.. మనదగ్గర ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజల మధ్యే ఉండాలన్నారు. 16,000 మందికి పార్టీ తరఫున డ్రైవింగ్ లైసెన్స్ అందించినట్లు తెలిపారు. పదివేల కుట్టు మిషన్లు ఇచ్చామన్నారు.
ఐదేండ్లుగా అభివృద్ధి చేశారు, అండగా ఉన్నారు, ఈ నెల రోజులు మీ గురించి కష్టపడతాం. మేము పోటాపోటీగా ప్రచారం చేస్తామని ముక్తకంఠంతో బీఆర్ఎస్ కార్యకర్తలు నినదించారు. రాష్ట్రంలో చీడ పురుగులు తిరుగుతున్నాయి. అలాంటి చీడ పురుగులను తరిమివేయాలంటే.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించాలి. సిద్దిపేటలో మేము మీ గురించి పని చేస్తామంటూ మంత్రి హరీశ్రావును ఉద్దేశించి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ముక్తకంఠంతో నినదించారు. ఈ ఎన్నికల్లో కష్టపడి మరోసారి లక్ష మెజార్టీ దాటిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ వేలేటీ రోజా రాధాకృష్ణ శర్మ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, ఎంపీపీలు మాణిక్యరెడ్డి, శ్రీదేవీచందర్రావు, ఒగ్గు బాలకృష్ణ యాదవ్, జడ్పీటీసీలు శ్రీహరిగౌడ్, ఉమా వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎర్ర యాదయ్య, యాదగిరి, కాముని శ్రీనివాస్, లింగం గౌడ్, ఎల్లయ్య, మాజీ ఎంపీపీ శ్రీకాంత్రెడ్డి, నాయకులు బాలకిషన్రావు, ఎడ్ల సోమిరెడ్డి దువ్వల మల్లయ్య, కుంబాల ఎల్లారెడ్డి పాల్గొన్నారు.
ఎంపీ ప్రభాకర్రెడ్డికి అలా జరగడం తీవ్రంగా కలివేసిందని మంత్రి హరీశ్రావు అన్నారు. చిన్న పేగు కు నాలుగు చోట్ల రంధ్రం పడిందని.. 17 సెంటీ మీటర్లు సర్జరీ చేసి చిన్న పేగు తొలిగించారన్నారు. ప్రభాకర్రెడ్డికి అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. సిద్దిపేటలో ఉండే ప్రతి కార్యకర్తకు ఇక్కడ గెలుపు ఎంత ముఖ్యమో ప్రభాకర్ రెడ్డి గెలుపు అంతే ముఖ్యమన్నారు. దుబ్బాకలో గెలిచిన ఎమ్మెల్యే రూపాయి పని కూడా చేయలేదని ఆరోపించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని, విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేసి అందరినీ కలుపుకొని పోవాలన్నారు. వంద ఓట్ల ఇన్చార్జీల పాత్ర ఎంతో కీలకమని.. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించామన్నారు. ఇండ్ల స్థలాలు రాని వారికి తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
నవ సిద్దిపేట, పదేళ్ల ప్రగతి పుస్తకాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట ప్రగతి పుస్తకాన్ని ఆవిషరించారు. నియోజకవర్గ అభివృద్ధిని కండ్లకు కట్టినట్టు పుస్తకంలో పొందుపర్చారన్నారు. ఒక పుస్తకం, ఒక ఫొటో ఎన్నో సమాధానాలకు అర్థమని చెప్పారు.