పదేండ్లు కాదు... నిరంతరం సీఎం కేసీఆర్ పాలన కావాలంటూ ప్రజలు నినదిస్తున్నారని పదేండ్లకాలంలో కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమైందని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాకతో గజ్వేల్ రూపురేఖలు మారిపోయాని పేర్కొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
మరోసారి కేసీఆర్ను దీవించాలి
ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
గజ్వేల్ నియోజకర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు
గజ్వేల్, జూలై 29: పదేండ్లు కాదు… నిరంతరం సీఎం కేసీఆర్ పాలన కావాలంటూ ప్రజలు నినదిస్తున్నారని పదేండ్లకాలంలో కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమైందని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాకతో గజ్వేల్ రూపురేఖలు మారిపోయాని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో అభివృద్ధి పనులు, గజ్వేల్లోని ఐవోసీ కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ధూపదీప నైవేద్యం ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఆడబిడ్డల పెండ్లి సమయంలో తల్లికే బాధలు తెలుసని, అందుకే తల్లిపేరుతోనే రూ.లక్షా 116 చెక్కును సీఎం కేసీఆర్ అందజేస్తున్నారన్నారు. శనివారం నియోజకవర్గంలోని 181మందికి రూ.1.08కోట్ల విలువైన చెక్కులను అందజేస్తున్నామని, ఇప్పటివరకు గజ్వేల్ పరిధిలో 11,777 మందికి రూ.10 8కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. అందరిబాధలు తెలిసిన సీఎం కేసీఆర్ ఆడబిడ్డల బరువు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పథకం ద్వారా ఆదుకుంటున్నారన్నారు. సర్కార్ దవాఖానలను బాగుచేసి నాణ్యమైన వైద్యాన్ని అందించడంతోపాటు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్న ప్రభుత్వం మనదేనన్నారు.
గజ్వేల్ దవాఖాన సరిపోవడంలేదని రూ.28కోట్లతో మరో 100 పడకల దవాఖానను నిర్మించుకుంటున్నామని, త్వరలో ప్రారంభించుకుంటామన్నారు. ప్రైవేటు దవాఖానకు వెళ్లి వేలాది రూపాయలను నష్టపోకుండా గర్భిణులందరూ తప్పకుండా ప్రభుత్వ దవాఖానల్లోనే ఉచితంగా ప్రసవం పొందాలన్నారు. గజ్వేల్లో అన్ని సౌకర్యాలతో దవాఖానను నిర్మించామన్నారు. బిందెలు పట్టుకొని మంచినీళ్ల కోసం పరుగులు తీసే రోజుల నుంచి ఇంటికే మంచినీళ్లు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ 24గంటల కరెంట్, రైతుబీమా, రైతుబంధు పథకాలు తీసుకొచ్చి రైతులకు మేలుచేశారని, సాగు నీటిని తీసుకొచ్చి పంటలకు జీవం పోశారన్నారు. దీపం లాంటి సీఎం కేసీఆర్ పాలనను మూడోసారి దీవించాలన్నారు. పదేండ్ల కిందట గజ్వేల్ పరిధిలో ఏ గ్రామానికెళ్లినా లోతు గుంతలతో రోడ్లు అధ్వానంగా ఉండేవని ఆటోలు, బస్సులు వెళ్లేవి కావన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఊరుకూ అద్దంలాంటి రోడ్లను వేశామని ఇవన్నీ సీఎం కేసీఆర్తోనే సాధ్యమయిందన్నారు. మనకు అండగా నిలబడిన కేసీఆర్కు అందరం అండగా ఉండాలన్నారు.
సీఎం కేసీఆర్ రైతుల పాలిట దీపమని, నిరంతరం పని కల్పించి, మూడు పూటలా అన్నం పెడుతున్నారన్నారు. వేరే ఏ రాష్ర్టాల్లో కూడా రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ రూ.2వేల ఆసరా పింఛన్ ఇవ్వడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లను నింపుకొని ఎండాకాలంలో కూడా తాగు,సాగునీటి కొరత రాకుండా చూశారన్నారు. రాష్ట్రంలోని జలాశయాల్లో ఉచిత చేప పిల్లలను పెంచడంతో రాష్ట్రంలోని ఏ గ్రామంలో చూసినా చేపలే చేపలు దొరుకుతున్నాయని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట చేపల మార్కెట్లో చేపలను కట్చేసే మహిళలు రోజుకు రూ.మూడు వేలు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు.
శ్రీగిరిపల్లిలో సిరి సంపద
సీఎం కేసీఆర్ రాకతో శ్రీగిరిపల్లికి సిరి సంపదలు పట్టుకున్నాయని కేసీఆర్ రాకముందు తాగడానికి నీళ్లు, కరెంట్ ఉండేది కాదని, గ్రామంలో సీసీ రోడ్లు లేవని ఎండాకాలంలో చుక్కనీరు దొరికేదికాదని మంత్రి హరీశ్రావు అన్నారు. మండలపరిధిలోని శ్రీగిరిపల్లిలో గ్రామ పంచాయతీ భవనం, వెటర్నరీ దవాఖానలను ప్రారంభించిన అనంతరం యాదవ, ఎస్సీ కులసంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకున్నామని గ్రామానికి రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, 24 గంటల కరెంట్ను తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు. శ్రీగిరిపల్లి సమీపంలోనే రింగ్రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఎకరం రూ.10లక్షలు ఉన్న భూమి ధర నేడు రూ.కోటి అయిందని మంత్రి మాట్లాడుతుండగా గ్రామస్తులు ఎకరం రూ.3కోట్లు పలుకుందన్నారు. మీ గ్రామ పరపతిని, గౌరవాన్ని పెంచింది సీఎం కేసీఆర్ అని కొనియాడారు. శ్రావణమాసంలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. అప్పట్లో గీతారెడ్డి, విజయరామారావు, సంజీవరావు ఉన్నప్పుడు నీళ్ల కోసం బిందెలతో రోడ్లపైకి వచ్చిన రోజులు మర్చిపోయారా అన్నారు. మీ అందరి కోసం సర్కార్ దవాఖానను బాగుచేసి ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, డెలివరి అయిన గర్భిణీని ఉచితంగానే ఇంటి వద్దకు పంపిస్తున్నామన్నారు. ప్రజ్ఞాపూర్లో నూతనంగా బస్టాండ్ నిర్మాణం జరుగుతుందని, త్వరలోనే రూ.19కోట్లతో జగదేవ్పూర్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.
విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి
పట్టణంలోని కేజీబీవీ పాఠశాల, కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో మంత్రి హరీశ్రావు ముచ్చటించారు. విద్యార్థి అఖిలతో మాట్లాడుతూ నిత్యం ఎన్ని కోడిగుడ్లు, ఎప్పుడెప్పుడు చికెన్ పెడుతున్నారని తెలుసుకోగా నాలుగుసార్లు కోడిగుడ్లు, రెండుసార్లు చికెన్ పెడుతున్నారని అఖిల మంత్రికి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని కేజీబీవీలతోపాటు అన్ని గురుకుల విద్యాలయాలు, వసతి గృహాలకు పెంచిన మెస్చార్జీలు వర్తిస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఐదు మెడికల్ కళాశాలుండగా తెలంగాణ స్వరాష్ట్రంలో 33 కళాశాలలను తీసుకొచ్చామన్నారు. 25శాతం పెంచిన మెస్చార్జీలతో విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలన్నారు. అనంతరం కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ భవనాన్ని ప్రారంభించారు. అంతకుముందు ప్రజ్ఞాఫూర్లో నూతనంగా నిర్మించిన ఈద్గా కాంప్లెక్స్ భవనాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం బటర్ైప్లె లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చెర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, రైతుబంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవీ రవీందర్, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, డీఎంహెచ్వో కాశీనాథ్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బెండె మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్మీరా, కౌన్సిలర్లు జకీయొద్దీన్, అర్చనాశివకుమార్, శ్యామల, రజిత, నాయకులు జఫర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
బస్తీ దవాఖాన ప్రారంభం
గజ్వేల్లోని ఆర్అండ్ఆర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పది గ్రామాల ప్రజలకు అందుబాటులో దవాఖానను ఏర్పాటు చేయడంతో కాలనీవాసులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.