క్యాన్సర్ బారినపడే వారి సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైందని, క్యాన్సర్ బారి నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో కీమోథెరపీ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దవాఖానలను బలోపేతం చేస్తున్నారన్నారు.రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత తొలి కీమోథెరపీ సెంటర్ను సిద్దిపేటలో ప్రారంభించుకున్నట్లు తెలిపారు. క్యాన్సర్ పేషెంట్లు హైదరాబాద్కు వెళ్లకుండా అన్ని జిల్లాల్లో కీమోథెరపీ సేవలు పొందేలా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తిస్తే త్వరగా వ్యాధిని నయం చేయవచ్చని, అందుకే ఊరూరా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. దేశంలోనే రెండో అతిపెద్ద క్యాన్సర్ దవాఖానగా ఎంఎన్జేను తీర్చిదిద్దామన్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీలో 62 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. త్వరలో లెవల్-1 ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అంతకు ముందు దవాఖానలో అత్యవసర విభాగాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరాతీశారు.
– సిద్దిపేట, ఏప్రిల్ 23
సిద్దిపేట, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): క్యాన్సర్ బారినపడే వారి సంఖ్య పెరుగుతుండడంతో ప్రభు త్వం అప్రమత్తమైందని, క్యాన్సర్ బారి నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, డీఎంహెచ్వో కాశీనాథం, కళాశాల ప్రిన్సిపాల్ విమలాథామస్తో కలిసి కీమోథెరపీ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దవాఖానలను బలోపేతం చేస్తున్నారన్నారు. దశలవారీగా అన్ని జిల్లాల్లోని మెడికల్ కళాశాలల్లో కీమోథెరపీ సెంటర్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో మొట్టమొదటి కీమోథెరపీ సెంటర్ను సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేటతో పాటు ఖమ్మం, కరీంనగర్, వనపర్తి, సిరిసిల్లలో వీటిని మంజూ రు చేసుకున్నామన్నారు. క్యాన్సర్ వ్యాధి తీవ్రత ఉన్న రోగులు హైదరాబాద్ వెళ్లకుండానే జిల్లాలోనే కీమోథెరపీ సేవలు పొందుతారన్నారు. ఎంతో దూరం ప్రయాణించి పని వదులుకొని రెండు మూడు రోజుల పాటు కీమో సేవల కోసం ఎదురుచూసే పరిస్థితి ఇక ఉండదన్నారు.
సిద్దిపేట సెంటర్లో 4 పడకలు ఉంటాయన్నా రు. ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో శిక్షణ పొందిన ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్నర్సులు ఉంటారన్నారు. ఇక్కడ 60 రకాల మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇవి ఎంఎన్జే క్యాన్సర దవాఖాన నుంచి ఇక్కడి సరఫరా అవుతాయన్నారు. ఎంఎంజే, నిమ్స్ దవాఖానలు రిఫర్ చేసిన క్యాన్సర్ పేషెంట్లు ఇక్కడ కీమోథెరపీ సేవలు పొందవచ్చన్నారు. ప్రతి రోగి 6 నుంచి 8 సార్లు కీమోథెరపీ అవసరం ఉంటుందన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కో కీమో సైకిల్కి 3 నుండి 4 వారాల గ్యాప్ అవసరం ఉంటుందన్నారు. ఒక్కో సైకిల్ కార్పొరేట్ దవాఖానలో కనీసం రూ.40 వేల నుంచి రూ 50వేల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. దీనివల్ల మొత్తంగా రూ.4లక్షల విలువైన వైద్యం మీ చెంతన ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.ప్రతి కీమో పేషెంట్, ప్రతి సైకిల్కి సీబీపీ, ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ పరీక్షలు చేయాల్సి ఉంటుందన్నారు. డయాబెటిక్ పేషెంటైతే ఎఫ్బీఎస్, పీఎల్బీఎస్ పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని మంత్రి హరీశ్రావు తెలిపారు. కార్డియాక్ కేస్ అయితే ఈసీజీ, 2డీకో పరీక్షలు చేస్తారని చెప్పారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించక పోవడంతో నష్టాలు జరుగుతున్నాయని, చాలామంది వ్యాధి ముదిరిన దశలో దవాఖానకు వస్తున్నారని మంత్రి తెలిపారు. అనారోగ్య పరిస్థితుల్లో దవాఖానల్లో చేరుతున్నారన్నారు. క్యాన్సర్ వ్యాధి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.
క్యాన్సర్ వ్యాధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ్ద..
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం క్యాన్సర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ్ద వహించదని మంత్రి హరీశ్రావు తెలిపారు. వ్యాధిని ముందుగా గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స అందించడంతో పాటు వారిని కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. జిల్లాలో క్యాంపులు ఏర్పాటు చేసి మొబైల్ స్రీనింగ్ నిర్వహిస్తామన్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం మొబైల్ స్రీనింగ్ సేవలు అందిస్తామన్నారు. ఆరోగ్య శ్రీపథకం ద్వారా సగటున సంవత్సరానికి రూ 100 కోట్లతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. 2014-15లో రూ.69 కోట్లు ఖర్చు చేస్తే, గతేడాది రూ.120 కోట్లు ఖర్చు చేశామన్నారు. క్యాన్సర్ చికిత్సపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రూ.800 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. హైదరాబాద్లోని ఎంఎన్జే, నిమ్స్ దవాఖానలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు అవసరమైన చికిత్సను అందిస్తున్నాయని తెలిపారు. అవసరాలకు అనుగుణంగా ఈ దవాఖానల్లో వైద్య సదుపాయాలు పెంచుతున్నట్లు వివరించారు. ఎంఎన్జే దవాఖానకు రూ 120 కోట్లతో స్టేట్ క్యాన్సర్ సెంటర్గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 300 పడకలతో కొత్త బ్లాక్ను ప్రారంభించి 750 పడకల వరకు విస్తరించుకున్నట్లు చెప్పారు. క్యాన్సర్ బారిన పడిన వారిని కాపాడుకునేందుకు అవసరమైన అత్యాధునిక చికిత్సలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు. ఎంఎన్జే, నిమ్స్ లో ఇప్పటికే అధునాతన పరికరాలను ఏర్పాటు చేసినటుల తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో రోబోటిక్ సర్జరీ చేసే ఎనిమిది అత్యాధునిక మాడ్యులర్ థియేటర్ల ప్రత్యేక బ్లాక్ను ఎంఎన్జీలో ఏర్పాటు చేసుకున్నామన్నారు.
ప్రస్తుతం నిమ్స్, ఎంఎన్జేలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎముక మూలుగ మార్పిడి (బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్) శస్త్ర చికిత్సలు జరుగుతున్నట్లు చెప్పారు. అవసాన దశలో ఉన్న వారికి సేవలు అందించేందుకు ఉద్దేశించిన పాలియోటీవ్ కేర్ సేవలను 33 జిల్లాలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. క్యాన్సర్ బాధితులకు ఇది అండగా నిలుస్తున్నదన్నా రు. వీరి కోసం ప్రత్యేకంగా ఆలన వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే ఇలా ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని మంత్రి అన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా జిల్లాస్థాయిలోనే క్యాన్సర్ను గుర్తించడానికి అవసరమైన మమ్మోగ్రఫీ, బయాప్సీ వంటి సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ హెల్త్ ప్రొపైల్ పథకం ద్వారా సాధారణ క్యాన్సర్ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి క్యాన్సర్ రాకుండా అలవాట్లు మార్పు కోసం (పొగాకు, సిగరేట్లు మానడం) ప్రాథమిక పరీక్షలు చేయించుకోవడం(రొమ్ము, గర్భాశయం సంబంధిత పరీక్షలు) ద్వారా వ్యాధి రాకుండా చూడడం, ఒకవేళ వచ్చినా దానిని త్వరతగతిన గుర్తించి చికిత్స అందించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవితం అలవాటు చేసుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు. ముడింట రెండోంతుల క్యాన్సర్లను మనం గతి తప్పిన ఆహార అలవాట్లు, పరిసరాల ప్రభావంతో వస్తున్నట్లు చెప్పారు. సిగరేట్లు, బీడీలు, గుట్కా తదితర వాటికి దూరంగా ఉండాలన్నారు. శాకాహారం తీసుకోవడం, శారీరక శ్రమ, వ్యాయామం, యోగా చేయడం వం టివి చేయాలని మంత్రి సూచించారు.