సిద్దిపేట జిల్లా జాతీయస్థాయిలో మరోసారి మెరిసింది. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా ఎంపికై అవార్డును కైవసం చేసుకున్నది. ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో చంద్లాపూర్ సర్పంచ్ సురగొని చంద్రకళారవిగౌడ్, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అజయ్భట్ నుంచి అవార్డు అందుకున్నారు. రంగనాయకస్వామి ఆలయం, రంగనాయక కొండలు, రంగనాయకసాగర్ ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా, ప్రకృతి పరంగా ఈ గ్రామానికి అనుకూలతలు కాగా, ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి అద్దం పడుతున్నాయి. గ్రామంలోని రంగనాయక సాగర్ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్నది. ఉత్తమ టూరిజం విలేజ్గా జాతీయస్థాయిలో గ్రామానికి అవార్డు రావడంతో మంత్రి హరీశ్రావు గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
చిన్నకోడూరు, సెప్టెంబర్ 27: సిద్దిపేట అంటేనే అభివృద్ధి, అవార్డులకు చిరునామాగా చెప్పవచ్చు. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కృషితో అన్నిరంగాల్లో జిల్లా దేశంలో సత్తాచాటుతున్నది. ఇప్పటికే సిద్దిపేట 50 వరకు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులను వచ్చాయి. తాజాగా సిద్దిపేట నియోజకవర్గంలోని చంద్లాపూర్ దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా ఎంపికై అవార్డును అందుకున్నది. పర్యాటక మంత్రిత్వశాఖ రాష్ట్రంలోని చిన్న గ్రామీణ ప్రాంతం ప్రత్యేకత, వివిధ రంగాల్లో సాధించిన విజయాలను పరిగణలోనికి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 4500 జనాభా ఉన్న ఈ గ్రామం అరుదైన చేనేతకు ప్రసిద్ధి చెం దింది. వైవిధ్యమైన గొల్లభామ చీరలతో సహా ప్రత్యేకమైన చేనేత రకాలను కలిగి ఉన్న ఈ గ్రామం పురాతన, సంప్రదాయ చేనేత కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది.
రంగనాయకసాగర్ రిజర్వాయర్ చంద్లాపూర్ గ్రామానికి మణిహారంగా మారడంతో పాటు ఈ ప్రాంతానికి విశిష్టతను తీసుకొచ్చింది. సిద్దిపేట పట్టణానికి సమీపంలో ఉన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లింక్ రిజర్వాయర్లలో రంగనాయక సాగర్ ఒకటి. రంగనాయకసాగర్ను మెగా టూరి జం డెస్టినేషన్గా మార్చేందుకు తెలంగాణ ప్రభు త్వం రూ.100కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేసింది. తరతరాలుగా ప్రసిద్ధి చెందిన గొల్లభామ చీరల ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న గ్రామం ఇక్కడి సంస్కృతిని ప్రోత్సహించడంతోపాటు సాంస్కృతిక, పర్యాటకరంగం పరిరక్షణకు ప్రసిద్ధి గాం చింది. చంద్లాపూర్ పర్యావరణ సుస్థిరత కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందడంతోపాటు మైక్రో వాట ర్షెడ్ కార్యకలాపాలను ప్రోత్సహించడం, సహజ వనరులు, సమాజ ఆధారిత నిర్వహణ కోసం గ్రామస్తులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. చంద్లాపూర్ గ్రామం ప్లాస్టిక్ నిషేధానికి ప్రసిద్ధి చెందింది. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కలిపిస్తూ గ్రామ నిర్వాసితులకు గుడ్డ సంచులు, జనపనార సంచులు అందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోలార్ లైట్ల వినియోగిస్తున్నారు.
తెలంగాణకు హరితహారాన్ని పెద్దఎత్తున ప్రచా రం చేస్తూ విరివిగా మొక్కలు నాటి పచ్చని గ్రామంగా చంద్లాపూర్ను తీర్చిదిద్దారు. టూరిజం విస్తరణతో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తోంది. గ్రామంలో ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపర్చుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకుంటూ, సాంస్కృతిక పర్యాటక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రణాళికా బద్ధంగా చేపట్టిన కార్యక్రమాలతో గ్రామం సాధించిన ప్రగతి నేడు జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపింది. హరిత హోటల్, శిల్పారామం పర్యాటకులను ఆకర్షిస్తోంది. టూరిజం డెవలప్మెంట్, వాల్యూ చైన్ ఇంటిగ్రేషన్తో గ్రామీణ ప్రాంతంలో వ్యాపార అభివృద్ధికి అనుకూలమైన ఫ్రేమ్వర్క్ను ప్రోత్సహించడానికి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంటర్ ప్రెన్యూర్షిప్ డ్రైవ్లో భాగంగా గ్రామంలో టూరిజం కార్యకలాపాలు పెద్ద విజయం సాధించాయి. చంద్లాపూర్ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది.
సిద్దిపేటకు గోదావరి జలాలు కావాలి అని ఒక కల.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఆ కల నెరవేరింది. కల నెరవేరడమే కాదు ఆ కలకు ప్రతిఫలం రావడం ఒక చరిత్ర.. రంగనాయక సాగర్తో నేడు చంద్లాపూర్ టూరిజం విలేజ్గా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషం. రంగనాయక సాగర్ నిర్మాణం సందర్భంగా భూమి త్యాగం చేసిన త్యాగధనులకి దక్కిన గౌరవం. సిద్దిపేట ప్రజలకు అభినందనలు. ఢిల్లీలో గ్రామస్తుల పక్షాన అవార్డు అందుకున్న సర్పంచుకు శుభాకాంక్షలు.
జాతీయ స్థాయిలో బెస్ట్ టూరిజం విలేజ్గా చంద్లాపూర్ ఎంపిక కాగా, దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం చంద్లాపూర్ సర్పంచ్ సురగొని చంద్రకళారవిగౌడ్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అజయ్భట్ నుంచి అవార్డు అందుకున్నారు.
మంత్రి హరీశ్రావు పట్టుదల వల్ల రంగనాయకసాగర్ నిర్మాణం జరిగింది. గోదావరి జలాలు రావడంలో మంత్రి అహో రాత్రులు శ్రమించారు. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు ఇచ్చిన నిర్వాసితుల త్యాగం గొప్పది. రిజర్వాయర్ ఏర్పాటుతో అవార్డు వచ్చింది. మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు.