పోడు భూముల సమస్యకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారని, గిరిజనులకు భూ హక్కు పత్రాలు అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పస్తాపూర్ ఎస్వీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ శరత్కుమార్, ఎమ్మెల్యేలు మాణిక్రావు, క్రాంతికిరణ్తో కలిసి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో 1808.07 ఎకరాల భూమికి సంబంధించి 1127 మంది రైతులకు పోడు పట్టాలు అందజేశామన్నారు. ఇక నుంచి వీరికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామన్నారు. రాష్ట్రంలో ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ కల్పించి విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు మెరుగుపర్చామని గుర్తుచేశారు. గిరిజనుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి దీవించాలని కోరారు. అనంతరం పట్టణంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటుచేసిన సభలో సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్కుమార్కు కండువా కప్పి బీఆర్ఎస్పార్టీలోకి ఆహ్వానించా రు. బుర్థిపాడు శివారులో ఆటో నగర్ కోసం భూమిపూజ చేశారు.
– జహీరాబాద్, జూలై 10
జహీరాబాద్, జూలై 10: సినీహీరో రజనీకాంత్ హైదరాబాద్లోని హైటెక్ సిటీ ప్రాంతానికొచ్చి నిజంగా నేను హైదరాబాద్లో ఉన్నానా…లేక న్యూయర్క్లో ఉన్నానా అని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీ గజినీలకు మాత్రం రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు. సోమవారం జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పస్తాపూర్ ఎస్వీ ఫంక్షన్హాల్లో జరిగిన సంగారెడ్డి జిల్లా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గిరిజనులకు పోడుపట్టాల పంపిణీ చరిత్రాత్మకం, ఏండ్లనాటి కలను నెరవేర్చింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో 1127 మంది రైతులకు 1808.07 ఎకరాల భూమి పంపిణీ చేశారు. మార్కెట్లో భూమివిలువ రూ. 900కోట్లు ఉంటుందని, పోడు రైతులకు హక్కులు కలిపించి పట్టాదారు పాసుపుస్తకం పంపిణీ చేయడంతో పాటు రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించామన్నారు. పోడుభూముల్లో వ్యవసాయం చేసే రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ సౌకర్యం, అకాలవర్షాలతో పంటనష్టం జరిగినా, ప్రభుత్వం ఇచ్చే పరిహారం లభిస్తుందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే బిందుసేద్యం పరికరాలు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై లభిస్తాయన్నారు. భూమి హక్కులు కుమారులు, భార్య పొందే అవకాశం ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. పోడుపట్టాకు వారసత్వం హక్కు పొందేందుకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారన్నారు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్, డైరెక్టర్లు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని భూమిఉంటేనే అవకాశం ఉంటుందన్నారు. పోడుపట్టాలు పొందిన రైతులకు ఇదో అవకాశం అని చెప్పారు.
భూమి లేకపోతే వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కాలేరని, పోడు భూములు సాగుచేసే గిరిజనులపై పెట్టిన కేసులను తొలగించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పోడు చట్టం తీసుకొచ్చి తెలంగాణలో అమలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులను ఓట్లు కోసం వాడుకున్నది.. తప్పు ఏనాడూ వారికి పోడుపట్టాలు ఇవ్వలేదన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టం అమలుచేసి తండాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామని, తెలంగాణలో ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ పెంచి విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గిరిజన పిల్లల చదువు కోసం గురుకులాలు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేశామన్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గిరిజనతండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. ఓట్లు వేయించుకొని మోసం చేశారాని, అదే సీఎం కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే రాష్ట్రంలో 2,145 గిరిజనతండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. తండాలకు త్రీఫేస్ కరెంట్ సరఫరా చేస్తున్నారన్నారు. ఈ యాసంగిలో ఏ రాష్ట్రంలో కోటి మెట్రిక్ టన్నుల వడ్లు పండించలేదని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కోటి మెట్రిక్ టన్నుల వడ్లు పండించామని మంత్రి చెప్పారు. తెలంగాణలో ప్రతిఇంటికీ సంక్షేమ పథకాలు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. గతంలో జహీరాబాద్ ఎమ్మెల్యేగా గీతారెడ్డి ఉండి ఉమ్మడి రాష్ర్టాంలో మంత్రిగా పని చేసినా నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని మంత్రి ప్రశ్నంచారు. తాగునీటి కోసం మహిళలు ఎన్నో కష్టాలుపడ్డారని, వారి కష్టాలను గుర్తించి సీఎం కేసీఆర్ మిషన్భగరీథ పథకం ఏర్పాటు చేసి ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్కు ప్రజల్లో మంచిపేరుందని, మరోసారి బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పాలకులు ప్రజలను మోసం చేశారు తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. సీఎం కేసీఆర్కు తెలంగాణపై అవగాహన ఉందని, దీంతో అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచామన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు చేయలేదని మంత్రి హరీశ్రావు ప్రశ్నంచారు. తెలంగాణ గిరిజన ప్రజలు సీఎం కేసీఆర్ను మరోసారి దీవించాలని కోరారు.
పోడు రైతులను ఆదుకున్నది సీఎం కేసీఆరే..
పోడు పట్టాల పంపిణీకి గిరిజనులు భారీసంఖ్యలో తరలివచ్చారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పస్తాపూర్ గ్రామంలో ఉన్న ఎస్వీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టాలు పంపిణీ చేశారు. పోడు పట్టాల పంపిణీ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడారు. సీఎం కేసీఆర్ కృషితో పోడుపట్టాలు పంపిణీ చేశారన్నారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం గిరిజన మహిళా రైతులతో కలసి మట్లాడారు. గిరిజన మహిళలతో భోజనాలు చేసి వారికి వడ్డించారు. గిరిజనులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గిరిజన నాయకులు మంత్రి హరీశ్రావుకు, ఎంపీ బీబీ పాటిల్కు, జహీరాబాద్, అందోల్ ఎమ్మెల్యేలు మాణిక్రావు, క్రాంతికిరణ్, కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డీసీఎంస్ చైర్మన్ ఎం.శివకుమార్లతోపాటు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు చింతా ప్రభాకర్, భూపాల్రెడ్డి, భిక్షపతి, తన్వీర్లకు గిరిజన సంప్రదాయాల ప్రకారం రుమాలు కట్టించారు. సజ్జారావుపేట సర్పంచు శంకర్నాయక్ వారిని సన్మానం చేశారు. సమావేశంలో ఎస్పీ రమణకుమార్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీసీఈవో ఎల్లయ్య, నియోజకవర్గ ప్రత్యేకాధికారి జయదేవ్ ఆర్య, ఆర్డీవో వెంకట్రెడ్డి, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి, వట్పల్లి ఎంపీపీ కృష్ణావేణి, జడ్పీటీసీ అపర్ణ, డీసీసీబీ డైరెక్టర్ కిషన్పవార్, గోవర్థన్రెడ్డి, గుండప్ప, తహసీల్దార్ స్వామి, ప్రేంకుమార్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి ప్రదాతను మరోసారి ఆశీర్వదించాలి
గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే పోడు భూములకు పట్టాలు వచ్చాయి. గిరిజనులకు ఫారెస్టు భూములపై హక్కులు కల్పించడంతో పాటు రైతుబంధు, రైతు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. గిరిజన తండాలతోపాటు గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. అన్నిరంగాల్లో అందరికీ లబ్ధి చేకూర్చుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను మళ్లీ ఆశీర్వదించాలి.
– బీబీ పాటిల్, ఎంపీ జహీరాబాద్
గిరిజనుల సంక్షేమానికి నిరంతర కృషి
గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటుచేసి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. పోడుపట్టాలు పంపిణీ చేయడంతో ఎంతోమంది పేదలకు మేలు జరిగింది. సంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా మొగుడంపల్లి మండలంలో 593 మంది రైతులకు 1392.06 ఎకరాల భూమికి హక్కులు కల్పించారు. జహీరాబాద్ మండలంలో 213 మందికి 123.57 ఎకరాలు, ఝరాసంగం మండలంలో ఏడుగురికి 19.00 ఎకరాలు, కోహీర్లో 168మంది రైతులకు 218.57 ఎకరాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 981మంది రైతులకు 1953.06 ఎకరాల పోడుభూములకు హక్కులు కల్పించారు. గిరిజనుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి దీవించాలి.
– ఎమ్మెల్యే మాణిక్రావు
గత పాలకులు హామీలిచ్చారు తప్ప సమస్యలు పరిష్కరించలేదు
గిరిజనులు ఎన్నో సంవత్సరాలుగా పోడుభూముల్లో పంటలు సాగుచేసుకుంటున్నా గత ప్రభుత్వాలు హక్కులు కల్పించలేరు. సీఎం కేసీఆర్ మాత్రమే గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. పోడుభూములకు పట్టాలు వస్తాయని ఎవరూ అనుకోలేదు. గత పాలకులు గిరిజనుల ఓట్లు కోసం హామీలు ఇచ్చారు తప్ప సమస్యలు పరిష్కరించలేదు. సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అందోల్ నియోజకవర్గంలోని వట్టిపల్లి మండలంలో 145మంది రైతులకు 53.16ఎకరాలు, చోటకూర్ మండలంలో ఒక రైతుకు 1.25 ఎకరాల పోడు భూమిని పంపిణీ చేశారు. గిరిజనులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు రుణపడి ఉండాలి.
– క్రాంతి కిరణ్, ఎమ్మెల్యే, అందోల్
పోడు పట్టాలు ఇవ్వడం చారిత్రాత్మకం
గిరిజనులకు, ఆదివాసులకు పోడుభూములపై హక్కులు కల్పించడం చారిత్రాత్మకం. అడవిలో ఉంటూ సీజన్కు ఒక్కో ప్రాంతంలో ఉండి జీవనంసాగించే వారు గిరిజనులు. అడవిలో పంటలు సాగుచేసుకుంటున్న వారికి ఫారెస్టు, పోలీసులతో వివాదం లేకుండా ప్రభుత్వం హక్కులు కల్పించింది. తరతరాలుగా పోడుభూముల హక్కుల కోసం గిరిజనులు కొట్లాడుతున్నారని, వారి సమస్యకు ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపింది. సంగారెడ్డి జిల్లాలో 1127మంది రైతులకు 1808.07 ఎకరాల భూమికి సంబంధిన హక్కు పత్రాలు అందజేసింది.
– డాక్టర్ శరత్కుమార్, కలెక్టర్