మెదక్, జనవరి 30 (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి కలెక్టరేట్: ఫిబ్రవరిలో అర్హులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్ నిర్వహించారు. కంటి వెలుగు, మనఊరు మనబడి, పోడు భూములు, ఆయిల్ పామ్, టీచర్ల బదిలీలు, జీవో 58, 59లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యకు సంబంధించి సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వంద శాతం సర్వే, గ్రామసభలు పూర్తి చేశామని అన్నారు.
అడవులను సంరక్షిస్తూనే చట్టానికి లోబడి సాగు చేస్తున్న గిరిజన, గిరిజనేతర రైతులకు పోడు భూముల పట్టాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, జిల్లాల వారీగా మరోసారి సమీక్షించుకుని అర్హులైన ప్రతిఒకరికీ న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పోడు భూముల పట్టాల పంపిణీ అనంతరం మరో ఇంచ్ భూమి కూడా ఆక్రమణకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తూ అర్హులందరికీ పోడు పట్టాల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్లకు సంబంధించిన డీఎల్సీ మాడ్యుల్స్ ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయని, రెండు రోజుల్లో ఎస్డీఎల్సీ నుంచి వచ్చిన దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. గ్రామసభల తీర్మానాలు, ఎస్డీఎల్సీ మధ్య ఉన్న గ్యాప్పై సమీక్షించాలన్నారు. గిరిజనులకు సంబంధించి చట్టం ప్రకారం పోడు భూముల పట్టాల కోసం వచ్చిన దరఖాస్తు తిరసరించే పక్షంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలుపాలన్నారు. కలెక్టర్లు ముందస్తుగా ఎస్డీఎల్సీ పూర్తి చేసిన దరఖాస్తులను ఆమోదించి, ఫిబ్రవరి 6 నాటికి పోడు భూముల పట్టాలు ప్రింటింగ్ పూర్తి చేసి సీఎం నిర్ణయించే తేదీ నుంచి పంపిణీకి సిద్ధంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు.
పారదర్శకంగా బదిలీలు, ఉద్యోగోన్నతులు
కంటి వెలుగు, టీచర్ల బదిలీలు, ఉద్యోగోన్నతులు, మనఊరు మనబడి, ఆయిల్ పామ్ సాగు అంశాలపై కలెక్టర్లతో సీఎస్ చర్చించారు. టీచర్ల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా కలెక్టర్లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదు స్వీకరణకు జిల్లాలో గ్రీవెన్స్ విభాగం, ప్రత్యేకంగా మెడికల్ బోర్డు, సదరం క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనఊరు మనబడి కింద పూర్తి చేసిన పాఠశాలలను ఫిబ్రవరి 1న పండుగ వాతావరణంలో ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. కంటి వెలుగు శిబిరాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 12,81,774 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 2.94 లక్షల మంది కండ్లద్దాలు పంపిణీ చేశామన్నారు. 2.05 లక్షల మందికి ప్రిస్రిప్షన్ కండ్లద్దాలు ఆర్డర్ చేశామన్నారు. జిల్లాలోని క్వాలిటీ కంట్రోల్ బృందాలు విసృ్తతంగా పర్యటించాలని, వారి ఫీడ్ బ్యాక్ తీసుకుని కలెక్టర్లు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు.
57 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు
రాష్ట్ర వ్యాప్తంగా 57 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, మార్చి చివరి నాటికి మరో 60 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ మొకలు నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్కు సంబంధించి 5 వేల ఎకరాల, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి 18 వేల ఎకరాల బిల్లులు వెంటనే అందజేయాలన్నారు. 24 గంటలో చెల్లింపులు పూర్తి చేస్తామన్నారు. జిల్లాలోని 20 వేల ఎకరాల భూమిలో డ్రిప్ ఇరిగేషన్ పరిపాలన 1అనుమతులు జారీ చేశామని, సదరు భూముల్లో త్వరగా డ్రిప్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 సమీకృత కలెక్టరేట్ భవనాలను ప్రారంభించామని, జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయం తప్పనిసరిగా ఐడీవోసీ నుంచి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు.
సంగారెడ్డి జిల్లాలో అన్ని చర్యలు చేపడుతున్నాం
జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు ఆర్వోఆర్ పట్టాలు పంపిణీ చేసేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని మంత్రులు, సీఎస్కు వివరించారు. జిల్లాలో కంటి వెలుగు విజయవంతంగా కొనసాతున్నదన్నారు. ఆన్లైన్లో వివరాల నమోదులో ఎలాం టి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రతి వారం డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక చేశామన్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ పాదర్శకంగా జరుగుతున్నదన్నారు. మనఊరు మనబడి కార్యక్రమం కింద పనులన్నీ పూర్తైన పాఠశాలలను ఫిబ్రవరి 1న పండుగ వాతావరణంలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎస్కు వివరించారు. వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, డీఎఫ్వో శ్రీధర్రావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి, డీఈవో రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం
అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ కంటి వెలుగుకు సంబంధించి ఆన్లైన్లో సరిగ్గా కనిపించని 515 వివరాలను సరిచేసి తిరిగి అప్ లోడ్ చేస్తామన్నారు. పోడు భూములకు సంబంధించి సబ్ డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి కమిటీకి వచ్చిన 182 క్లెయిమ్స్ను త్వరలో పరిశీలించి అర్హులకు పోడు పట్టాలిచేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మన ఊరు మనబడి కింద 15 పాఠశాలల్లో పనులు పూర్తి చేసిన వాటిని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్లో డీఎంహెచ్వో చందు నాయక్, అటవీ శాఖాధికారి రవి ప్రసాద్, బీసీ అభివృద్ధి అధికారి కేశూరం, డీఈవో రమేశ్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.