మెదక్ : మహిళా లబ్ధిదారులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు మహిళా లబ్ధిదారులతో కలసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ఆయా సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి.. వాటి ప్రయోజనాలు ఎలా ఉన్నాయని అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కిట్టు అందుతుందా అని మహిళలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భూదమ్మ అనే మహిళ మాట్లాడుతూ.. గతంలో పింఛన్లు 200 రూపాయలు మాత్రమే ఇచ్చే వాళ్లు సార్.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ రూ. 3016 వికలాంగ పింఛన్లు, 2016 లు ఒంటరి మహిళ పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు.
అలాగే వివిధ ప్రభుత్వ పథకాలు అర్హులందరికి అందుతున్నాయన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు ఆరేళ్ల గాయత్రి, రాగి వనజ, భట్టి లలిత, దొంతి, లక్ష్మి, యశోద, వేదవతి, కల్యాణి, జయశ్రీ, మమత, రుక్మిణి, షేకమ్మ, మానస, శమున్నీసా బేగం, రామాయంపేట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పుట్టి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.