జహీరాబాద్, సెప్టెంబర్ 23 : జహీరాబాద్ ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసి పనులు వేగవంతంగా చేస్తున్నది. నేడు మంత్రి హరీశ్రావు విచ్ఛేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు ఆ ధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి హరీశ్రావు కృషితో కొత్తగా రూ. 15కోట్లతో దవాఖాన భవన నిర్మాణం చేయడంతో దానిని నేడు మంత్రి ప్రారంభించనున్నారు. ఇదే కాకుండా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప చేస్తారు. సంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటకలోని బీదర్కు వెళ్లే ప్రజలకు సర్కార్ దవాఖాన ప్రారంభిస్తుండటంతో మేలు జరగనున్నది.
మంత్రి హరీశ్రావు పర్యటన..
మంత్రి హరీశ్రావు 10:30 గంటలకు జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్లో మైనార్టీ జూనియర్ కళాశాల భవనాన్ని (ఉర్ధు మీడియం) ప్రారంభిస్తారు. 11:00 గంటలకు మొగుడంపల్లి మండలంలోని మన్నాపూర్లో రైతువేదిక భవనం, 11:15 గంటలకు సీసీ రోడ్డు, డివైడర్లు ప్రారంభిస్తారు. 11:40 గంటలకు అంబేద్కర్ భవనం, 12:10 గంటలకు శ్మశాన వాటికకు నిర్మాణం చేసిన సీసీ రోడ్డు ప్రారంభించి, 12:20 గంటలకు మనఊరు-మనబడి పనులకు శంకుస్థాపన చేస్తారు. 12: 30గంటలకు రైతు వేదిక భవనం ప్రారంభిస్తారు. 12:45గంటలకు తెలంగాణ గిరిజన బాలికల గురుకుల పాఠశాల, కళాశాల భవనాన్ని ప్రారంభించి, అ క్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు. 3గంట లకు జహీరాబాద్ మున్సిపల్లోని ఐడీఎస్ఎంటీ కా లనీలో నిర్మాణం చేసి మిషన్ భగీరథ ట్యాంకును ప్రారంభిస్తారు. 3:30గంటలకు హమాలీ కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన, 4గంటలకు ప్రభు త్వ జూనియర్ కళాశాల భవనం, 4:30గంటలకు జహీరాబాద్ పట్టణంలోని సర్కార్ దవాఖనలో ని మాతాశిశు సంరక్షణ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 6గంటలకు సంగారెడ్డిలో నిర్వహించే పోడు, సాగు భూము ల సమన్వయ కమిటీ సమీక్ష సమావేశానికి హాజరవుతారు.