ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సదాశివపేట, సంగారెడ్డి, ఎద్దుమైలారానికి చెందిన పలువురు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి హరీశ్రావు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్కు మద్దతుగా మనబిన్ ఫౌండేషన్ చైర్మన్, సభ్యులు బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉన్నదన్నారు. ఐదేండ్లలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. నిత్యం ప్రజల్లో ఉండే బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రూ.300 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలను ఏకంగా రూ.వెయ్యికి పెంచి పేద, బడుగు,బలహీన వర్గాలపై భారంమోపిందన్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రూ.400లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు. పదేండ్లలో చేసిన అభివృద్ధి ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్నదని, మరోసారి అవకాశం ఇస్తే దేశంలోనే అభివృద్ధిలో ప్రథమస్థానంలో ఉంటామన్నారు.
సదాశివపేట, అక్టోబర్ 25: వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. బుధవారం మనబిన్ ఫౌండేషన్ చైర్మన్, సుప్రీం కోర్టు న్యాయవాది ఎంఏ ముఖీమ్, ఫౌండేషన్ సభ్యులు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఇలియాజ్ షరీఫ్, జేఏసీ జిల్లా చైర్మన్ సత్తయ్యయాదవ్, మునిపల్లి రమేశ్, ఉస్మాన్ బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి హరీశ్రావు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పట్టణంలోని ముర్షద్ దర్గా మైదానంలో 10వేల మందితో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి తన్నీరు హరీశ్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్కు మద్దతుగా మనబిన్ ఫౌండేషన్ చైర్మన్, సభ్యులు బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉన్నదన్నారు. ఐదేండ్లలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సదాశివపేటకు ఒక్కసారి కూడా రాలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో పేదలకు ఇండ్ల స్థలాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగ్గారెడ్డి సంగారెడ్డికి రాలేదన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి చింతా ప్రభాకర్ అని గుర్తు చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని, పేదలకు ఇండ్ల స్థలాలు, పట్టాలు అందజేసే బాధ్యత తనదేనన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితుడినై బీఆర్ఎస్లో చేరానని మనబిన్ ఫౌండేషన్ చైర్మన్ ఎంఏ ముఖీమ్ తెలిపారు. మూడేండ్లలో ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, క్రీడలకు ఎన్నో కార్యక్రమాలు చేశానన్నారు. దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉన్నదన్నారు. ఊపిరున్నంత వరకు బీఆర్ఎస్తోనే ఉంటానన్నారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని, బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు.
మనబిన్ ఫౌండేషన్ చైర్మన్ ఎంఏ ముఖీమ్, ఫౌండేషన్ సభ్యులు మద్దతు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ అన్నారు. ముఖీమ్ సాబ్ వేరే పార్టీ నుంచి పోటీలో ఉన్నా మంత్రి హరీశ్రావు సూచన మేరకు 10వేల మందితో బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉన్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రచార ఇన్చార్జిలు ఎర్రోళ్ల శ్రీనివాస్, భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజేందర్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.