జనం ప్రభంజనంలా మారింది. రోడ్షోలు జన జాతర్లను తలపించాయి. సోమవారం గజ్వేల్, వర్గల్, ములుగులో నిర్వహించిన రోడ్షోల్లో ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఒక్కొక్కరుగా కదిలొచ్చి వేలాదిగా మారి లక్ష మందికి పైగా పోటెత్తారు.
జై కేసీఆర్ అంటూ నినాదాల హోరు కొనసాగింది. కార్య కర్తలు, జనంతో గులాబీమయంగా మారా యి. మహిళలతోపాటు యువకులు పెద్ద ఎత్తున తరలివరావడం విశేషం. ఈ సందర్భంగా ప్రజలు హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.