మెదక్ : గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని హవేళి ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండాకు వెళ్లే బ్రిడ్జి కూలిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్రిడ్జిని రూ.3 కోట్ల తో నిర్మించి శాశ్వత పరిష్కారం కల్పిస్తామని మంత్రి హామీనిచ్చారు. తండా వాసులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వెంటనే గ్రామస్తులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ తదితరులు ఉన్నారు.