రైతులు, ‘ట్రైడెంట్’ ఉద్యోగులకు వెంటనే బకాయిలు చెల్లించాలని, లేదంటే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ట్రైడెంట్ పరిశ్రమ ఆస్తులను వేలం వేస్తామని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ట్రైడెంట్ యాజమాన్యం, రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ భద్రి మాలోత్రి, సంగారెడ్డి కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి చెరుకు రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ఉన్న ట్రైడెంట్ ఫ్యాక్టరీ గత సీజన్లో రైతుల నుంచి చెరుకు కొనుగోలు చేసి రూ.12.05 కోట్లు బకాయి పడిందని, గత నెల 25వ తేదీలోగా క్లియర్ చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. బకాయిలు ఇవ్వకపోతే పరిశ్రమ ఆస్తులను వేలం వేస్తామని హెచ్చరించారు. ఇందుకు స్పందించిన ట్రైడెంట్ ఎండీ నందకుమార్ ఈ నెల 15వ తేదీ వరకు బిల్లులు కట్టేస్తామని మంత్రి హరీశ్రావుకి తెలిపారు.
-జహీరాబాద్, జూన్ 2
జహీరాబాద్, జూలై 2: జహీరాబాద్ సమీపంలోని కొత్తూర్ ట్రైడెంట్ చక్కెర పరిశ్రమకు చెరుకు సరఫరా చేసిన రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పరిశ్రమ అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ట్రైడెంట్ యాజమాన్యం, రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ భద్రి మాలోత్రి, సంగారెడ్డి కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి చెరుకు రైతుల పెండింగ్ బిల్లులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రైడెంట్ పరిశ్రమ యాజమాన్యం వెంటనే స్పందించి రైతులకు బకాయిలు చెల్లించాలని ఆదేశించారు. గత సీజన్లో చెరుకు సరఫరా చేసిన రైతులకు రూ.12.05 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. జూన్ 25వ తేదీ లోగా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా, ఇంతవరకు చెల్లించలేదని వారి పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిశ్రమలో విధులు నిర్వహించే ఉద్యోగులకూ పెండింగ్ బిల్లులు వెంటనే అందజేయాలన్నారు. రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం పరిశ్రమ ఆస్తులను వేలం వేస్తామని స్పష్టం చేశారు. వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో రైతులకు బిల్లులు చెల్లిస్తామన్నారు. చెరుకు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు పరిశ్రమ యాజమాన్యం కూడా సహకరించాలన్నారు. బిల్లులు చెల్లించడం లో నిర్లక్ష్యం వహిస్తే పరిశ్రమ లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇందుకు స్పందించిన పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ రామ్నాథ్ రామానుజుల నందకుమార్ ఈ నెల 15వ తేదీ వరకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని మంత్రికి తెలిపారు. సమావేశంలో హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమా ర్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్, జిల్లా అధికారి రాజశేఖర్, ఆర్డీవో వెంకారెడ్డి, తహసీల్దార్ స్వామి, ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.