మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 26: జీవో 58, 59 ద్వారా క్రమబద్ధీకరించిన ప్రభుత్వ భూములకు సంబంధించి పట్టాలను మంబోజిపల్లి గ్రామానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు మంత్రి హరీశ్రావు ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు.
మంత్రికి ఘన స్వాగతం
అంతకుముందు మెదక్కు విచ్చేసిన మంత్రి హరీశ్రావుకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికి, గజమాలతో సన్మానించారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మెదక్ నియోజక వర్గ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.