హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్) కోల్హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాడ్లింగ్ ప్లాంట్, ఓఅండ్ఎం పనులను ఔట్సోర్సింగ్కు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 19న విద్యత్తు సౌధలో మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. పీఆర్సీ, ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ రూల్స్, ఈపీఎఫ్ టూ జీపీఎఫ్, ఖాళీల భర్తీ వంటి ప్రధాన డిమాండ్లతో మహాధర్నా నిర్వహించనున్నామని తెలిపింది.
సోమవారం విద్యుత్తుసౌధలో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించిన జేఏసీ నేతలు సమస్యల పరిష్కారంలో విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు స్పందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉద్యోగులు, ఆర్టిజన్లు భారీగా తరలివచ్చి ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. పోస్టర్ ఆవిష్కరణలో జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్రావు, వైస్ చైర్మన్ వజీర్, తాజుద్దీన్ బాబా, భూపాల్రెడ్డి, పీ సదానందం, శ్రీనివాస్రెడ్డి, సురేష్కుమార్, వెంకటనారాయణరెడ్డి, విద్యాసాగర్, కిరణ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.